My Blog List

Saturday, March 20, 2010

పగటి వేషాలు - సామాజిక అంశాలు

            ఈ ప్రసంగాలు అక్టోబర్ 12 ,19 ,26  తేదిలలో విజయవాడ ,ఆకాశవాణి కేంద్రం నుండి ప్రసారం అయినాయి . వారి సౌజన్యం తో ..........




                  పగటి వేషాలు - సామాజిక అంశాలు




                 పగటి కలలు కనొద్దు అంటారు 
              పగటి వేషాలు వెయ్యొద్దు అని కూడా అంటారు 
              వేషం అంటే మారు రూపం 
              రావణాసురుడు మారు రూపం లో వచ్చి సీతను మాయం చేస్తాడు 

              పగటి వేషాలు చూసే కోణం లో వేషం వెనుక అసలు రూపం తెలుసు కోవాలి .అవి ఇప్పటికి అన్వయించు కోవచ్చు 
             ఈ వేషాల వెనుక ఆనాటి నేపధ్యం ఉంది . పురాణాలు,ఇతిహాసాలు ,మొదలైన వాటి లోనుంచి వచ్చిన వేషాలు ఆనాటి ,ఈనాటి,రేపటి,జిఇవితాన్ని మనకు చూపిస్తాయి .సామాజిక పరిస్థితులు.మనిషి లోపలి వేద్వంసం గురించి చెప్తాయి .ఒక పరమ ప్రయోజనం ఆశించి మనిషి లో ఆశను కలిగిస్తాయి. మంచి జిఇవనానికి దిక్సూచిగా ఉంటాయి. 
        
            ఇప్పుడు చెప్పుకో బోయే 34 పగటి వేషాలలో కొన్ని అంతరించి పోవచ్చు ,మరి కొన్ని అంతరించే దశలో ఉండొచ్చు ,మరి కొన్ని కొత్త రూపం లోకి మారే దశలొఉండొచ్చు. 
            కొన్ని పాత్రల అవసరం తీరి పోయింది .
            కొన్ని పాత్రలు ,చట్టాలు చేయడం వల్ల,సామాజిక మార్పుల వల్ల అదృశ్య మైనాయి .
            కొన్ని పాత్రలు ఆధునిక రూపాలలో మనం చూస్తూనే వున్నాం.
            ఈ నాటి రకరకాల పాత్రలాక్ ,వేషాలకు 'పగటి వేషాలే ' మూలం.
            ఇప్పుడు పగటి వేషాల వెనుక కథ ,అవి ప్రజలకు ఉపయోగపడిన తీరు,వాటిని ప్రభుత్వ పథకాలుగా మార్చిన వైనం తెలుసుకుందాం.ఈ కళాకారులు ప్రతి వేషాన్ని ప్రారంభించే విధానాన్ని తెలుసు కుందాం










                    బుడబుక్కల వేషం






.                
                      త్రేతా యుగం లో దశరథ మహా రాజు సంతానం కలగానందున బాధ తో కుమిలి పోతున్నాడు . ఆ బాధ నుండి అతనికి విముక్తి కలగా చేసి రఘు వంశాన్ని అభివృద్ధి చేయాలనేది శ్రీ మహా విష్ణువు సంకల్పం . అందుకోసం దశరధుని పుత్రకామేష్టి యాగాన్ని చేయమని చెప్పటానికి బుడబుక్కల వేషం ధరిస్తాడు శ్రీ మహా విష్ణువు. అలా ఈ వేషం లో దశరధుని దగ్గరకు వచ్చి యాగం చేయమని ప్రేరేపించటం ఈ వేషం నేపధ్యం.


                 వ్యవ సాయం లో పంట దిగుబడి తగ్గి బాధ పడే రైతులు ,అనేక సమస్యలతో నిరాశ చెంది జిఇవితం పై విరక్తి చెందు తున్నారు .


                ఆర్థికంగా ,శారీరకంగా,మానసికంగా, బాధలలో ఉన్న వారందరిని నిరాశకు లోను కావద్దు, భవిష్యత్తు లో బాగుంటుందని చిగురించే ఆశలు కలిగిస్తున్నారు ఈ వేషం ద్వారా . ప్రస్తుతం బాధల నుండి విముక్తి పొందటానికి చేయవలసిన పనుల గురించి ఆలోచించి,ఆచరణలో పెట్టటమే తక్షణ మార్గం , పరిష్కారమని ప్రజలకు చెప్తారు.


               విజయం సాధించాలంటే అసంతృప్తి ,అసహనం,మానసిక ఒత్తిడి తగ్గించుకోవాలి .సమాజంలో అన్ని వర్గాల తో సత్సంబందాలు నెలకొల్పు కోవటం ద్వారా ,సానుకూల దృక్పధాన్ని అలవరచి కోవాలి. పరిపరి విధాల పోయే మనసు ను సానుకూల దృక్పధం వైపుకు మరల్చమని చెప్పేదే ఈ వేషం . ప్రజలకు భవిష్యత్ మీద నమ్మకం కలిగించే  మాటలు చెప్పటానికి మానసిక వైద్యులు ,సానుకూల ఆలోచన తరగతులు నిర్వహించే వారు కృషి చేస్తున్నారు.






               వేషం చెప్పే విధానం:




             ఏయ్ ,నిలునిలు చండాలి ,అయిరే అంబా పల్కు జగదంబా పల్కు,ఆయీ పల్కు,ఆయితాయీ పల్కు, సద్గునాంబ పల్కు స్య్కాట్ శ్రోణి పల్కు యక్షిని పల్కు అంబర పక్షి పల్కు,ఆకాశవాణి పల్కు,కంచిలోని కామాక్శీ పల్కు,కాలికింద భూదెవి పల్కు ,కాశీలోని విశాలాక్శీ పల్కు మధురలోని మీనాక్షి పల్కు,బెజవాడ కనక దుర్గ పల్కు ..........






                                ************          ************        







               భట్రాజుల వేషం








                    రాజాస్థానాలలో భట్రాజులు వుండేవారు. రాజుని అనుక్షణం పోగాడటమే వీరి పని,వుద్యోగం. రాజుని కీర్తిమ్చడమే కాక ,రాజ సభకు వచ్చిన వారిని సైతం పొగుదుతూ రాజుకు సంతోషం కలిగించేవారు. యుద్దాల సమయం లో సైన్యాలను ,రాజు గారి ధీర గుణాలను కేర్థిస్థూ ,మానసికంగా యుద్దానికి సమాయత్తులను చేస్తారు.


                   మనిషి లో వున్నా సర్వ శక్థులనూ బహిర్గ్హత పరచి  ,ఆ దిశగా ఆలోచించి ,ఆచరణ లోకి దిగటానికి సహాయ పడుతుంది ఈ వేషం. ధైర్య సాహసాలను ,ఆలూచనను మేల్కొలిపి జీవనసమరానికి సిద్ధం చేయటం ఈ వేషం ప్రత్యేకత .మంచి భావాలను కలిగించటం ,ధైర్యాన్ని కలిగించటం ,దీవించటం చేస్తారు భట్రాజులు .


                మనకు తెలియని మన శక్తిని హిప్నాటిజం దేఅర్రా ప్రదర్శింప చేస్తున్నారు. ఈ వేషం ద్వారా జరిగే ప్రయోజనాన్ని నేడు మానసిక వైద్యులు కలిగిస్తున్నారు. ఆధునిక సమాజంలో హిప్నాటిస్టు లే భట్రాజులు.


                   వేషం చెప్పే విధానం :

             ధర సింహాసానమైన భంబు గొడుగై,తద్దేవతల బృత్యులై ,బ్రహ్మాండ మాకారమై,షిరి భార్యామణి ఐ ,విరంచి కోడుకై ,శ్రీ గంగ సత్పుత్రి అయి ,వరుసాన్నీఘన,రాజసంబు నిజమై ,వర్థిల్లు నారాయణా!
            చంద్రా, కందర్ప,నలకుబరా,పురూర్వకాంతు,వసంతు,జయంతాదుల కన్నను అపూర్వకరంబైన ,మీ చక్కదన మున్నూ ,పద్మ మహా పద్మ ,శంకమాచక్ర,నీలా,అమనీలా,ధనుస్కు,దానవా దానంబుల కన్నా అద్భుతమైన మీ సంపద లున్నూ................

************             ************ 


             చాతాది వైష్ణవుల వేషం



                 
                క్రీస్తు పూర్వమ్ 2060 సం. ల   క్రితం శ్రీ శంకరా చార్యుల వారు జన్మించి నపుడు ,ప్రపంచమంతా శివమతం ఉండేదని చెపుతారు.తరువాత క్రీస్తు శకం 972 వ  సం.లో   శ్రీ రామానుజాచార్యులు ఉద్భవించారని చెబుతారు .ఈ మతాచారాలను బట్టి ,ఆరు మతాలుగా విభజించారని అందులో వైష్ణవ మతం గురించి చెప్పారు. అలాగే మానవ జీవితమ్ గురించి ,వేదాంత విషయాలను భోధించే నేపధ్యం ఈ వేషం. 

              భక్తీ  పాటలు పాడుతూ ప్రజలక భక్తీ ని వివరిస్తూ ,వారిని సన్మార్గంలో నడిపిస్తూ,విజ్ఞాన వినోదాలను అందించే కళారూపం ఇది.భక్తీ,జ్ఞాన ,వైరాగ్య కీర్తనలు ,పోతులూరి వీర బ్రహ్మం గారి తత్వాలు చక్కగా పాడుతూ భక్తీ ని ప్రభోదిస్తారు . మంచి విషయాలను ఆకళింపు చేసుకొని క్రమ మార్గం లో జివిం చ టానికి ప్రజలు ప్రయత్నిచే వారు.ఇహపరమైన అన్ని విషయాలను తెలుసుకొని,అశాశ్విత మైన విషయాల పట్ల అప్రమత్తంగా ఉంటూ,బ్రతికి నంత కాలం హాయిగా,ఆనందం గా ఉంది ,చుట్టూ ఉనా సమాజాని కూడా అలాగే ఉంచాలని చ్ప్పే కళారూపం ఇది. 


           చావు లాంటి విషయాలను జయించాలంటే భక్తీ మార్గమే ఉపశమనం . నేడు పెచ్చ్లరిల్లు తున్న అరాచకాలను అణచటానికి కూడా భక్తీ మార్గం ఒక సాధనం. ప్రభుత్వం వారు దేవాదాయ ధర్మదాయ శాఖ ద్వారాఅనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తునారు.




                       వేషం చెప్పే విధానం :



జగతిలో  మనవ జన్మమే దొరకదు 
దొరికిన పురుషుడి పుట్టుటరదు
పురుషుడి పుట్టిన పొలతి మంచిది రాదు 
వచ్చిన భాగ్యంబు హెచ్చు తరదు 
భాగ్యశాలికి పుత్ర ఫలము చేకూరదు 
కూడిన వితరణ జాలుట రదు 
వితరణ కల్గిన విహిత శాంతము సున్న
శాంతము కల్గిన సత్య మరదు
సత్య మదవిన  శ్రీ హరి స్మరణ కలదు 
హరిణి భజియించి న వాడె పరమ యోగి

************            ************


             
                  
(ఇలా వీలు వెంబడి ఈ వ్యాసాన్ని ప్రచురిస్తాను ,దయచేసి చూసి మీ అభిప్ర్రాయాన్నితెలియ చేయండి  )

No comments:

Post a Comment