My Blog List

Tuesday, December 7, 2010

బుడబుక్కల వేషం(పగటి వేషాలు)

బుడబుక్కల వేషం
'బుడ....బుడ.... బుడబుడ.....బుడబుక్...'
అనే ఢమరుక శబ్దం ,మధ్యలో ఘంటా నాదం,గంభీరమయిన కంటఃస్వరం తో ........
రాగ యుక్త కీర్తనల తో ......'

ఆ ప్రదేశం గ్రామమే ! ఆ కాలం సంక్రాంతి కాలమే!
ఆ వచ్చింది బుడబుక్కల వారే!
పండిన పంటలతో గ్రామాలలో ఇళ్ళు కళకళలాడాలని , గ్రామం సుభిక్షంగా వుండాలని, ఆశిస్తారు బుడబుక్కల వారు.అలాగే బుడబుక్కల వారు తమ గ్రామానికి వస్తే శుభప్రదమని భావిస్తారు పల్లెవాసులు.
చేతిలో ఢమరుకం ,నడుముకు ఘంట ,భుజాన జోలె, నల్ల కోటు వేసుకుని ఆపై శాలువా ధరించి,ఎర్రని తలపాగా చుట్టుకొని ,నల్లటి గొడుగు తో కనిపిస్తారు బుడబుక్కల వారు.తెల్ల వారు ఝామునే భిక్షాటన ముగించాలనేది వీరి సాంప్రదాయం.
పల్లెల్లో ఇల్లాళ్ళు తెల్లవారు ఝామునే లేచి ,వాకిట్లో కళ్లాపి జల్లి ,అందమైన ముగ్గులతో అలంకరించే వేళ
'అంబ పల్కు..జగదంబ పల్కు..' అంటూ వచ్చే బుడబుక్కల వారి ఆశిస్సులు తీసుకుని, భిక్ష వేస్తారు .మగవాళ్ళు గేదలదగ్గర శుభ్రం చేస్తూ , పండిన పంట తాలూకు ఆలోచనలు చెస్తూ ,చేయబోయే పనుల గురించి ,ఇంటికి కావలసిన అవసరాల గురించి ,కొనబోయే వస్తువుల గురించి,కొత్త అల్లుళ్ళ గురించి ....రకరకాల పధకాలు వేస్తూ వుంటారు.
తాము వచ్చిన ప్రదేశం లో ఏ వైపు ఈతి భాదలు వుంటాయో చెప్పి,నివారణ ఉపాయాలు ప్రజలకు తెలియ చేసి ధైర్యం చెపుతూ ముందుకు సాగుతారు బుడబుక్కల వారు. ఇది వీరి కుల వృత్తి . వీరి కులం 'బుడబుక్కల' . వీరు సంచార జీవులు. ఏ గ్రామం వెళితే ,అ గ్రామ కుమ్మరుల ఇళ్ళ దగ్గరే ఉండి, భోజనం కూడా వాళ్ళ దగ్గరే చేస్తారు. సంచార జీవులైన వీరిని ఎస్టీ లలో కలప లేదు ప్రభుత్వం.
స్వాతంత్రానికి పూర్వం జమిందార్లు వీరికి భూములు ఇచ్చారు. సంక్రాంతి రోజులలో మూడు నెలలు యాచించగా వచ్చిన ధాన్యం తో జోలె నిండి పోయేది. అలా మూడు నెలల యాచనను, ఎడ్ల బండి కెత్తుకుని వెళ్ళేవారు. క్రమక్రమంగా రైతు పరిస్థితి దిగజారడంతో ,యాచన లేక భుక్తి గడవటం ఇబ్బందిగా ఉండి,కుల వ్రుత్తి ని పక్కన పెట్టి కూలీలుగా,పాట బట్టలు అమ్మే వారుగా కాలం గడుపుతున్నారు.
మన రాష్ట్రం లో వీరి సమాఖ్య పడి లక్షలకు పైగానే వుంది. కాని వీరికి రాజకీయాలలో ప్రాతినిధ్యం లేదు.అనంత పురం,జహీరాబాద్,ఆమ్తోల్,కరీంనగర్,వరంగల్ జిల్లా లలో ,ఖమ్మం అన్ని మండలాలలో వీరు ఎక్కువగా వున్నారు. 'బుడబుక్కల కబుర్లోద్దు',ఒరే బుడబుక్కలోడా','వీడొక బుడబుక్కలోడు' లాంటి పిలుపులతో తక్కువ భావం తో తిట్టుగా మారిన వీరి కులం పేరు మార్చాలని ప్రయత్నం జరుగుతోంది. ఖమ్మం ప్రాంతాల వారు,'రాజ క్షతియ','జ్ఞానేశ్వర్' అనే పేర్లు సూచించారు. వీరికి ప్రభుత్వం నుంచి అన్ని రకాల సాయాలు అందాలని బుడబుక్కల సంఘం అధ్యక్షుడు,చంద్ర శేఖర్, యుత్ వెల్ ఫేర్ ప్రసిడెంట్ రాములు కృషి చేస్తున్నారు.



పగటి వేషాల వారి ప్రదర్శన





పగటి వేషాల వారు బుడబుక్కల వేషాన్ని కాదు రమ్యం గా ప్రదర్శిస్తారు . ఢ మరుకం 'బుడబుడ...' అంటుంది కాబట్టి వీరు ఈ వేషాన్ని బుడ బుడకల వేషం అని పిలుస్తారు. ఈ వేషాన్ని ఇద్దరు,లేక ఐదుగురు ప్రదర్శిస్తారు. అమ్దరికీ సంప్రదాయక వస్త్రాలుం టాయి . పంచే ,లాల్చీ,లాయరు కోటు,పైన శాలువా,పెద్దపెద్ద మీసాలు పెట్టుకుంటారు. నుదుటన పసుపు బొట్లు అడ్డంగా పెట్టి ,ఆపైన ఎరుపు బొట్టు రూపాయి బిల్లంత సైజు పెట్టుకొని,గడ్డం మీద నుండి తల పైకి వచ్చేట్లుగా ఎర్ర రంగు గుడ్డ చుట్టూ కుంటారు. మేడలో రుద్రాక్ష మాలలు,చేతికి కడియాలు,కాలికి గగ్గేరలు తొడుక్కుం టారు. ఇంతకు ముందు గ్రామ పెద్దలు బహుకరించిన సింహ తలాటాలు,మెడల్స్ తో అలంకరించు కుంటారు. ఘంటా కంకణం ,మకర కుండలాలు ధరించి గ్రామం లోకి అడుగు పెడతారు.
ముందుగా ఆ వూరి పోలేరమ్మను ,ఆ వూరి పెద్దలను అందరిని తలచుకొని ,అక్కడ 'వురికట్టు ' ఏర్పాటు చేసుకొంటారు. అమ్మవారికి మ్రొక్కి ,ప్రార్థించి ,కోడిని బలి ఇచ్చి ,ఈ వేషాన్ని ఊరంతా ప్రదర్శిస్తారు. ఉదయం ఆరు గంటలకు మొదలు పెట్టి మధ్యాన్నం రెండు గంటల దాకా ప్రదర్శిస్తారు. ఐదుగురు వేష గాళ్ళ లో ఒకరు బుడబుక్ వాయిస్తే, ఒకరు చేతిలో గజ్జెలు,ఒకరు గంట,ఒకరు డప్పు,మరొకరి చేతిలో భిక్ష పాత్ర వుంటుంది.
' అంబ రావే...జగ డంబ రావే.... -బుడబుక్
కంబ కంటిని .... కాళి రావే ....-బుడబుక్ '
అయ్యలారా...అమ్మలారా... ఈ రోజు వేషం బుడబుక్కలు. బుడబుక్కలు చెప్పే మాటలు దేవతలా ముచ్చట్లు .
' కాశి విశాలాక్షి పల్కు ...కంచి కామాక్షి పల్కు...-బుడబుక్
కలకత్తా కాళి పల్కు.....మధుర మీనాక్షి పల్కు...-బుడబుక్
ఆ కొండపై వెలసిన విజయవాడ దుర్గమ్మ పల్కు...'

మేం ఇప్పుడు పుట్టినోల్లం కాదు మారాజా. " కృతయుగం లో శ్రీ హరి బుడబుక్కల వాని ఏసం ఏసి శివునికి త్రిపురసురల సంహరించే ఉపాయం జోస్యం చెప్పినాడు మారాజ్ ! త్రేతాయుగం లో డంభికాసురుడనే రాక్ష సుడిని చంపి వాని డింభం డోలక ఢ మరుకం చేసి ,వాని నరము తాళ్ళుగా,చర్మం మూతలుగ, చేసి బుడబుక్కల వాని వేషం లో వచ్చి ,సూర్య వంశం గురించి చెప్పి ,ఢ మరుకం వాయించిన మేము ఇప్పుడు ఇల్లిల్లు తిరిగి దీవిచి పోతున్నాం మా రాజ్ . త్రేతాయుగంలో దశరద మహారాజు సంతానం లేకుండా చింతిస్తున్న సమయం లో శ్రీ మహా విష్ణువు ,బాగా యాలోచన చేసి ,రఘు వంశం ఇంతటితో ఆగి పోరాదు,దశరధుని నిరాశను ఆశ గా చిగురింప చేయాలని ఒక రోజు బుడ బుక్కల వాని వేషం లో వచ్చి.......' రాజా,రాజాధిరాజ ,రాజ మార్తండ, రవి కల్ప భోజ ,రాజ,నీకు భవిష్యత్తు చాల ఉండ్య. సంతానం లేదని చింత పద వద్దు. నువ్వు వీరుడివి,శురిడివి, అమాత్యుడివి, కాబట్టి నీకు పుత్ర సంతానం కావాలనే ఆలోచన వుంది. అందుకు చక్కని పధకం చెబుతాను విను' అన్నాడు. అంతవరకు ఎంతో చింతిస్తున్న దశరధుడు నిరస నిస్పృహలను వదలి పెట్టి ,భవిష్యత్తు మీద ఆలోచనతో ,ఆశతో 'చెప్పండి' అన్నాడు. అప్పుడు శ్రీ మహా విష్ణువు 'పుత్రకామేష్టి' యాగాన్ని చేస్తే, తప్పకుండా నీకు పుత్రులు జన్మిస్తారు'అని చెప్పాడు. అలా పుట్టిన మేము ఇప్పడు గ్రామా గ్రామాన తిరిగి మంచి విషయాలు,దేవతలా ముచ్చట్లు తెలుపుతూ వుంటం.
తమ వంటి దాతలు ఉన్నంత కాలం ఈ దేశానికి ,ఈ భూమికి మంచి జరుగుతుంది. ఈ సంవత్సరం మా సేతు గారికి లక్షల లక్షల లాభం కలిగి ,శుభోజ్జయం కలిగి,బుడబుక్క ల వారి ఆశీస్సులు గలిగి ,...ఎల్లప్పుడూ జయాన్ని పొందాలి....జయీ భవ..... విజయీ భవ.... దిగ్విజయీ భవ .......
'అంబ పల్కు...జగదంబ పల్కు.....-బుడబుక్
బంబర వేణి పల్కు....బకల ముఖి పల్కు....-బుడబుక్ '





సామాజిక అంశం:


వ్యవసాయంలో పంట దిగుబడి తగ్గి బాధ పడే రైతులు ,అనేక సమస్యలతో నిరాశ చెంది జీవితంపై విరక్తి చెందుతున్నారు .


ఆర్థికంగా ,శారీరకంగా,మానసికంగా, బాధలలో ఉన్న వారందరిని నిరాశకు లోను కావద్దు, భవిష్యత్తు లో బాగుంటుందని చిగురించే ఆశలు కలిగిస్తున్నారు ఈ వేషం ద్వారా . ప్రస్తుతం బాధల నుండి విముక్తి పొందటానికి చేయవలసిన పనుల గురించి ఆలోచించి,ఆచరణలో పెట్టటమే తక్షణ మార్గం , పరిష్కారమని ప్రజలకు చెప్తారు.


విజయం సాధించాలంటే అసంతృప్తి ,అసహనం,మానసిక ఒత్తిడి తగ్గించుకోవాలి .సమాజంలో అన్ని వర్గాలతో సత్సంబందాలు నెలకొల్పుకోవటం ద్వారా ,సానుకూల దృక్పధాన్ని అలవరచి కోవాలి. పరిపరి విధాల పోయే మనసును సానుకూల దృక్పధం వైపుకు మరల్చమని చెప్పేదే ఈ వేషం .
నేడు ప్రజలకు భవిష్యత్ మీద నమ్మకం కలిగించే మాటలు చెప్పటానికి మానసిక వైద్యులు ,సానుకూల ఆలోచన తరగతులు నిర్వహించే వారు కృషి చేస్తున్నారు.





-తాతా రమేశ్ బాబు,
గౌరవ అధ్యక్షులు : కళా భారతి,
సాంప్రదాయ జానపద కళాకారుల సంక్షేమ సంఘం ,రిజి.429 /2009
బిళ్ళపాడు

Sunday, August 15, 2010

త్రిపురనేని శ్రీనివాస్ జ్ఞాపకాలు

మనిషి ని తోటి మనిషి దోచుకొనే దోపిడీ వ్యవస్థను మా తరం తోనే అంత మొందించాలనే ఆకాంక్ష తో ,సామాజిక చైతన్యానికి సహకారిగా, "జనప్రభ " సాహిత్య మాస పత్రికను పంతొమ్మిది వందల ఎనభై ఐదు ,జనవరి నెలలో ప్రారంభించాం . "జనప్రభ" సంపాదకుడు గా నేను ,అనగా తాతా రమేశ్ బాబు ను వున్నాను .


" త్రిపురనేని శ్రీనివాస్" అనే యువకుడు ,తన కవితలు ,కథలు ప్రచురించి ,ప్రోత్సహించమని ,నాకు ఉత్తరాలు రాసేవాడు. రచనా స్థాయి ప్రాధమిక దశలొ కాబట్టి ,"మార్పులు చేర్పులు చేయాల్సిన అవసర ముంటే చేయ "మనే ఉత్తరాన్ని ,అయన దగ్గర నుండి తీసుకుని ,విషయం చెడ కుండా సంస్కరించి ప్రచురించాను. ప్రారంభించిన ౩ వ నెలలో "కార్మిక వృక్షాలు " అనే వచన కవితను,మే నెల సంచికలో "కాగితం పులి "["చిత్తూర్ జిల్లా లోని ఒక పల్లెలో వాస్తవం గా జరిగిన కథకు అయన శక్తి మేరకు ,కల్పితాల వ్యక్తుల పేర్లతో పంపిన కథ ను నాలుగు సార్లు తిరగ రాసి ] అనే కథను ప్రచురించాను


కాగా ,అదే సం. నవంబరు ఇరవై మూడవ తేదిన ఒక వుత్తరం రాసాడు .క్రింద చూడండి....


తా.ర.గారికి [తాతా రమేశ్ లో మొదటి అక్షరాల]


నేను అరెస్ట్ అయి జైల్లో వున్నపుడు మీరు మా ఇంటికి వచ్చి వెళ్ళారని మా తమ్ముడు చెప్పాడు. మిమ్మల్ని కలవ లేక పోయి నందుకు చాలా విచార పడ్డాను.


నన్ను జూన్ పదిహేనవ తేదిన అరెస్ట్ చేసి పద్దెనిమిది న రిమాండు కు పంపారు. మూడు నెలలు వాయిల్పాడు సబ్ జైలు లోను ,రెండు నెలలు చిత్తూరు గ్రేడ్ -రెండు జైలు లోను వున్నాను .పూర్తిగా ఐదు నెలలు వున్న తర్వాత ఈ నెల పదిహేడు న రిలీజ్ అయ్యాను. కండిషనల్ బెయిల్ మీద ప్రస్తుతం రోజుకు రెండు సార్లు పోలిస్ స్టేషన్ లో సంతకం పెడుతూ తిరుపతి లోనే వున్నాను. నా మీద హత్యా,బాంబులు,కత్తులు ,తుపాకులు,కేసు పెట్టారు. ఈ జిల్లా లో కలికిరి సమితి ప్రసిడెంట్ మల్రెడ్డి అనే భూస్వామి ని ,నేను మరో పడి మంది కలసి హత్య చేసినట్లు కథనం. అతను పొయినా సం. ఏప్రిల్ నెలలో పీపుల్స్ వార్ పార్టి చేత హత్య చేయ బడ్డాడు .నేను పాల్గొనక పోయినా ఒక క్రూర భూస్వామి ని హత్యాచేసిన అభి యోగం నా మీద మోపి నందుకు గర్విస్తున్నాను. విప్లవం లో ఇటు వంటి నిర్భందకాండ మాములేగా.


జైల్లో నేను రాసిన ఒక కవిత ను జనప్రభ లో ప్రచురణకు పంపుతున్నాను . ప్రచురించ గలరని ఆశిస్తూ న్నను. పత్రికలూ పంపుతూ వుండండి. త్వరలో చందా పంపిస్తాను.


ప్రస్తుతం రాష్ట్రం లో విప్ల వోద్యమం మీద నిర్భంద కాండ చాలా ఎక్కువ గానే వుంది.ఇలాంటి సమయాల లోనే రచయితల బాధ్యతా ఎక్కువగా వుంటుంది. ఆ భాద్యత ను ,మీ వంతు కర్తవ్యంగా మీరు జనప్రభ ద్వారా నేర వేర్చ గలరని ఆశిస్తూ సెలవు తీసుకుంటాను. వెంటనే వుత్తరం వ్రాయండి.


మీ


త్రిపురనేని శ్రీనివాస్



పై ఉత్తరానికి సమాధానం గా , "మనుషుల మనసులను మంచి మార్పు కోరే చైతన్యదీప్తులు గా వెలిగించతమే నా లక్ష్యం "అని రాసాను.


తరవాత వేగుల ద్వారా శ్రీనివాస్ చేస్తున్న రక రకాల ప్రయాణాల గురించి తెలుసుకుంటుననపుడు ఏడుగు తున్నాడో ,దిగ జారుతున్నాడో అర్థమయ్యేది కాదు.


"ఆంద్ర జ్యోతి " వార పత్రిక సంపాదకుడు గా వెనుక బడిన వాడ ,దళితవాడ ,స్త్రీ వాడ లను ,పత్రిక లో ప్రముఖం గా చర్చ కు పెట్టాడు. కాగా ఆయా చర్చల వల్ల ఈ వాదాలు జనాలను కలిపాయో ,చీల్చతానికి పనికి వచ్చాయో తెలియదు కాని,అందరు హాయిగా మాట్లాడుకునే పరిస్థితి పోయింది . తెలంగాణావాదం లాంటివి మొదలు అవుతున్న దశలో athanu మరణించాడు. ఆ తరువాతి కాలంలో నన్ను చూసినా ,నేను పలకరించే ప్రయత్నం చేసినా ,తన స్థాయి చాలా గొప్పదన్నట్లు ప్రవర్తిం చేవాడు. రాస్తున్న కవిత్వానికి ,ఆచరణకి అబెధం చూపాలని ప్రయత్ని స్తున్నపుడు ,- నీచ ,స్వార్థ,సంకుచిత,ప్రయోజనాలు కలిగిన ,అన్ని రకాల ప్రజాపార్టీ లా పేరుతొ వున్న, వాటి అనుభంద సంస్థలలో వున్న వ్యక్తులు నన్ను అనేక ఇబ్బందులు గురిచేసి నప్పుడు ,మొక్కవోని ఆత్మ విశ్వాసం తో నిలబదినపుడు, జి.శ్రీరామా మూర్తి గా బ్రతుకుతూ,కవిగా చచ్చి పొయినా 'నిజం' ,' ఎన్ని దుష్ట శక్తులు,మరిన్ని ప్రజా వ్యతిరేక శక్తులు ,ఎన్నెన్ని పన్నాగాలతో ,ప్రలోభాలతో ,ప్రజభ్య్దయ ప్రభాకరులను హరించి వేసినా, నీ వంటి ఉదయారుణ కిరణాలను మాత్రం నిశ్శేషం చేయజాలవు. నిజాయితీ,ప్రజా నిబద్ధత ,నీలో చావా నంత కాలం నీ అక్షరాలూ నిప్పురవ్వలు .రివిజినిజం,రాజీతనపు చెదలు వాటి దరిచేరవు " అని' పెన్ను' చరిచి దన్ను గా నిలిపాడు.


ఆ తరవాత త్రిపురనేని శ్రీనివాస్ ప్రముఖ వెండి తేరా దర్శకుడు రాంగోపాల్ వర్మ తో కలసి సినిమా కుడా తీస్తున్నాడని ,వింటున్న దశలోనే ,aa charchala'మత్తుగా " దుర్మరణం చెందాడని విన్నాను.

Saturday, August 14, 2010

రాంబాబు కాపరం

నమస్కారం .నేను రాంబాబు గా నటించిన హాస్య నాటిక , 'రాంబాబు కాపరం" అనే రేడియో నాటిక లింకు పంపుతున్నాను. రచన : అద్దేపల్లి భరత్ కుమార్ , నిర్వహణ : ఎలిసెల నాగేశ్వర రావు , పాత్రలు :రాంబాబు : తాతా రమేశ్ బాబు ,సీత : వి.ఎస్.,రత్నమాల ,వానర మూర్తి : డి. నాగేశ్వర రావు, సింగినాథం ; పఠాన్ చందు ఖాన్ .ఈ నాటిక ఫిబ్రవరి 2 ,2008 రాత్రి 9 .30 నుండి 10 వరకు -ఆకాశవాణి విజయవాడ కేంద్రం నిర్మించి ప్రసారం చేసింది.
లింకు : http://www.mediafire.com/?f9xcq56wta162tu
విని మీ అభిప్రాయాన్ని తెలుపు తారని ఆశిస్తూ ........

Tuesday, May 18, 2010

కవిత్వ "మంటే"?

కవిత్వమంటే .....
కొంతమందికి బాగా బోంచేసినట్టు
కొంతమందికి కళ్ళు జ్వలిస్తున్నట్టు
కొంతమందికి అస్థికలు,బొమికలు ,వేపమండలు కనపడుతున్నట్టు
కొంతమందికి డిటెక్టివ్ లు ,సెక్స్ బాంబు లు కనపడుతున్నట్టు
కొంతమందికి కులాలు ,స్త్రీలు ,మైనార్టీలు కనబడుతున్నట్టుగా వుంది.
సరే ,ఎవరి దృక్పథాలు వారికి వుంటాయి .
అయితే,ముందు నువ్వు రాజకీయం చెప్పినా ,మరేదయినా చెప్పినా ,కవిత్వమంటే కవిత్వంగా వుండాలి . అంటే రాసినది ఖచ్చితంగా కవిత్వమై వుండాలి .

ఏది కవిత్వం?

ఫలానాది కవిత్వం,ఫలానాది కవిత్వం కాదు అని చెప్పటానికి వైమర్శిక కొలత బద్దలు లేవు . అందువల్ల కవిత్వాన్ని చదివే పాఠకుడి యొక్క సంస్కారం మీద కవితా స్థాయి ఆధార పడి వుంటుంది . అంటే చదివేటటువంటి వారి హృదయం ,ఏది చదివితే చలిస్తుందో అది ఉత్తమ కవిత్వం . ఏది చదివితే హృదయం పాషాణ ప్రాయమై పోయిందో , కదల కుండా -అది చెత్త కవిత్వమని తేల్చేయ వచ్చు .
కవి అవటానికి ,కాక పోవటానికి ,సమాజానికి పనికి వచ్చే కవిత్వానికి పనికి రాకుండా పోయే కవిత్వానికి తేడా వుంది .ప్రధానం గా మనం చూడ వలసినది కవి అవునా? కాదా?
దీనికి ఏమిటి ఆధారం ?
వ్రాసిన కవిత్వమే దీనికి ఆధారం.
తరువాత ఆలోచించాలి . కవిత్వం మనకు పనికి వస్తుందా? అని.

ఇవాళ మనని వేధిస్తున్న సమస్య ఏమిటంటే , వస్తువు నుండి మనం కవిత్వం చూస్తున్నాం ,చూడవలసిందే . ఇప్పుడు సంప్రదాయకులు ,ఆధునికులు కూడ అలాగే చూస్తున్నారు .పూర్వ అలంకారికులు 'రసధ్వని కావ్యాత్మకం ' అన్నారు. అయితే ,ఆధునికులు ఏమి చెబుతున్నారంటే ,ఆనాడు కావ్యానికి శిల్పం ప్రాణ మైంది . ఈనాడు కావ్యానికి వస్తువు ప్రాణంగా నిలిచింది ......ఇలా భారత దేశం లో వచ్చిన విమర్శకు లందరూ ఎవరికీ తోచిన అభిప్రాయం వారు చెబుతున్నారు.
ఇవాళ వున్న విమర్శకులలో చాలా మంది వస్తువుకే ప్రాధాన్య మిచ్చి ,వస్తువును ఆధారంగా చేసుకుని కవి అవునా కాదా అనేది నిర్ణయిస్తున్నారు .ఇదే సిద్ధాంతం పునాదిగా వచ్చినటువంటి వాళ్ళలో శిల్పాన్ని విస్మరించటం శోచనీయం .
ఒకప్పటి రష్యా లోని ప్రముఖ విమర్శకుడు 'లూనా చేరస్కి ' . ఆయన మేధావి కూడా. రష్యా పోరాట చరిత్ర లో వున్న విజయాలు ,అపజయాలు తెలిసిన వ్యక్తి . జార్ చక్రవర్తుల క్రింద ప్రజలు పడినటువంటి వేదన అవగాహన ఉంది. అయన ఏమి చెప్పాడంటే, "కవి గాని,రచయిత గాని చెప్పదలచుకున్న భావం రాజకీయ నాయకుడైనా చెప్పగలడు,తన ఉపన్యాసం ద్వారా. కాని సాహిత్యానికి ,రాజకీయ నాయకుడి కంటే ప్రజల హృదయాలను ప్రభావితం చేసే శక్తీ ఎక్కువ వుంటుంది ,కనుక కవిత్వాన్ని చదివెట్టువంటి వారి హృదయాన్ని ప్రభావితం చేయాలి అంటే రచన అయినా శిల్ప సహితంగా వుండాలి కాని, శిల్ప రహితంగా , ఉత్త నినాదంగా ఉండకూడదు" అని. ఒక మార్క్సిస్టు విమర్శకుడికి ఉండ వలసిన ప్రాధాన్యం ఏమిటో ఆతను చెప్పుకొస్తూ పై విషయాన్ని వ్రాసాడని కీ.శే. టి.ఎల్. కాంతారావు అన్నారు.
తరువాత రచయిత చెప్పదలచు కొన్నది -ప్రధానంగా కవి దృక్పధం. ఎవరి కోసం చెబుతున్నాడు ? ఎందుకోసం చెబుతున్నాడు ? మొదటి ప్రశ్నకు సమాధానమే రచయిత యొక్క రచనా శిల్ప స్థాయి ఆధారపడి వుంటుంది . ఎందు కంటే , విశ్వనాధ ని కవి కాదన్న వాళ్ళు వున్నారు . గురజాడ ని కవి కాదన్న వాళ్ళు వున్నారు . శ్రీ శ్రీ కవిత్వమంతా చెత్త కవిత్వం అన్న వాళ్ళు వున్నారు . ఎందుకు కవి కాదంటున్నారు ? ఫలానా వాడు కవి అవును అనడానికి కేవలం వస్తువు పునాది అవుతుందా?
సాహిత్యంలో ఇది మంచిది కాదు.
అయితే , విశ్వనాథ వారు సమాజానికి , కాలానికి ఎంత మాత్రమూ పంకిరాని కవి అని నిర్మోహ మాటంగా చెప్పవచ్చు . ఇది వాస్తవం ,అయినా ఆయన కవి కాకుండా పోడు. అలాగే గురజాడ అప్పారావు గారు వీళ్ళ కొలమానాల్లో చూస్తే కన్యాశుల్కం లో హీరోయిన్ ఎవరు? హీరో ఎవరు? ఇందులోన రసము ఏమిటి? ఇవన్ని ఆలోచించి గురజాడ ను కవి కాకుండా చేయటానికి అకవి అనే పదం ఆనాడు సృష్టించారు. సృష్టి లో పొట్ల పల్లి సీతారామయ్య లాంటి వాళ్ళు పాల్గొని గురజాడ మీద కావలసినంత దుమ్ము చల్లారు .చిత్ర మేమిటంటే ,కొందరి నిర్ణయాలతో కవులూ చావరు. అలాగే నిర్ణయాలతో కవులు బతకరు. అక్కిరాజు ఉమా కాంతం గారు భావ కవులందరిని దుమ్మెత్తి పోయాలనే ఉద్దేశ్యంతో నేటి కాలపు కవిత అనే పుస్తకం రాసారు. కాని సాహిత్య చరిత్ర ఇప్పటికి రుజువు చేసిన సత్యం ఏమిటంటే ,నేటి కాలపు కవిత అనే పుస్తకం చచ్చి పోయింది . పుస్తకం లో కవులయితే పనికి రారని రాసారో కవులందరూ,వాళ్ళు చచ్చి పోయినప్పటికీ ,వాళ్ళ కవిత్వం జీవించే వుంది. అందుకే నిజంగా కవి అయిన వారిని ఎవరూ చంపలేరు. కవి కాని వాడ్ని ఉపన్యాసాలతో పొగడ్తలతో ఎవరూ జీవింప చేయలేరు. ఇది నిజము. అందుకనే దుష్ట విమర్శలు దుష్ట సమీక్షలు ,కవుల్ని బతికించ లేవు ,చంపలేవు. అయితే విమర్శ లన్నిటి లొనూ వస్తు దృక్పధం పూర్తిగా కనపడుతుందని స్పష్టం గా చెప్పు వచ్చు .

విశ్వనాథని కవి కాకుండా చేయాలనే ఉద్దేశ్యంతో ఆయన వ్యాకరణ దోషాలు ఉద్గ్రంధాలు గా వచ్చినా కవి గా చావలేదు. అల్లాగే త్రిపురనేని రామస్వామి మీద విమర్శల వల్ల ఆయన హేతువాదం చావలేదు.
" మనం ఆలోచించేప్పుడు నేత్రాలను,మేధస్సును పరిశుబ్రం చేసుకుని చదవటం ,ఆలోచించటం చేయక పోయినట్లయితే కవిత్వం ఎప్పుడూ అకవిత్వం గానే కనపడుతుంది. "

పద్యమే కవిత్వమా?

వచనాన్ని ఛందోబద్దం చేసినంత మాత్రాన పద్యం కాదు. పూర్వం చాలా చచ్చు విషయాలను కూడ పద్యాలలో చెప్పారంటే దానికి కొన్ని కారణాలు ఉనాయి. నాటికి సంకేతిక పెరుగుదల లేదు. కాగితం లేదు . ముద్రణా సౌలభ్యం లేదు . అందుచేత ఆనాడు వచనం వికసించలేదు . ఏది చెప్పినా సంక్షిప్తంగా వుండాలి. వచనాన్ని పేజీలకు పేజీలు గుర్తుంచుకో లేరు . అందువల్లనే ఆనాడు శాస్త్ర జ్ఞానం చెప్పినా, గణితం చెప్పినా అన్ని శ్లోకాల లోనే చెప్పారు. శ్లోకాలలో క్లుప్తత వుంది. క్లుప్తత స్పేస్ ప్రాబ్లం ని కవర్ చేస్తుంది . ఆనాడు ఎన్ని ఉద్గ్రంధాలు వచ్చినా ,అందులో కవిత్వాన్ని ఎరుకోంటే కొంతే కనపడుతుంది. కాగా కథ ప్రాధాన్యమైన గ్రంధాలు ఎక్కువ. పద్యం లోనే రాస్తేనే కవిత్వం అనే భ్రమలో ఇవాల్టికి కొంతమంది వున్నారంటే ,వీళ్ళని ఎం చేసినా మారారు.

కథాకావిత్వం

ఇవాళ కవిత్వంలో కథ అనవసరం. కథ ఒక పక్కకి వెళ్లి పోయింది . కథకు కావలసినంత మంది వున్నారు. కవిత్వంలో కథ యొక్క అవసరం లేదు. ఆనాడు భారతం కాని,రామాయణం కాని కథా ప్రధానమైన కావ్యాలు ప్రతిదీ పద్యం లోనే రాయవలసి వచ్చింది. నన్నయ్య గారి భారతం చదివిన ప్రతి వారికీ, ఇవాళ వస్తూన్న పద్యాలన్నీ దండగ అనిపిస్తుంది . వచన కవిత్వం లో కథా కావ్యాల గురించి కుందుర్తి కీ ,తిలక్ కీ మధ్య చర్చ జరిగింది. వచన కవిత్వంలో కథా కావ్యాలు రావాలని కుందుర్తి వాదన, అవసరం లేదని తిలక్ ఆవేదన. కుందుర్తి ఎంత ఆధునికుడై నప్పటికీ ,ఆయన లోపల ఒక వేదన వుండేది. ఇప్పుడు వచ్చిన ఆధునిక కవితాన్ని అంతటినీ , వయాకరనుల చేత ,పండితుల చేత ,ఆలంకారిక శాస్త్రజ్ఞుల చేత మెప్పించాలానే ఆరాటం. "మెచ్చ నంటావు నీవు, మెచ్చకుంటే మించి పోయే ,కొయ్య బొమ్మలే మెచ్చు " అని గురజాడ చెప్పినట్లుగా ,ఎవరు మెచ్చినా మెచ్చక పోయినా ప్రవాహం ఆగదు. విషయం కుందుర్తి కి తాను జీవించిన కాలంలో తెలియ లేదు.

అనుభూతి

అనుభూతి అంటే కొంత మందికి ఒంటి మీద గొంగళి పురుగులు పాకినట్టు వుంటుంది. అనుభూతి అంటే బ్రహ్మ పదార్ధం కాదు . కవిత్వం లో అనుభూతి వాదానికి వ్యతిరేకంగా చాలా మంది వున్నారు. ఇదే విషయం లో ఇంద్రగంటి కి ,కే.వి.అర్ కి మధ్య గతంలో కొన్ని దస్తాలు ఉత్తర ప్రత్యుత్తరాలు నడిచాయి. అనుభూతిని వైయుక్తక మైనటువంటి దానిగా మనం సంకుచిత పరచనక్కర లేదు. ఒక బలవంతుడు ,బాగా బలహీనుడిని కొడుతున్నాడను కొండి . మనం అందరం చూస్తున్నా ఒకే రకంగా స్పందిం చము . ఒకరు చాలా తీవ్రంగా స్పందిస్తారు. ఒకరు మనకెందుకులే పొమ్మను కుంటాడు. ఒకరు ఇంకా కొట్టాలి మాత్రం చాలదు అనుకుంటారు . అనుభూతులు దేని మీద ఆధారపడి వుంటాయి ?
ప్రపంచం లో జీవించే ప్రతి వ్యక్తీ కూడ తనకు తెలిసో తెలవకో ఒక వర్గ స్వభావాన్ని కలిగి వుంటాడు. అది మెలకువ లో నయినా కావచ్చు ,సుషుప్తి లోనయినా కావచ్చు. లేకపోతె వర్గ స్వభావం అతనికి స్పష్టంగా తెలిసి వుండక పోవచ్చ్చు . వర్గ స్వభావం లేకుండా రచన చేయటం, వర్గ స్వభావం లేకుండా పటనాన్ని కొనసాగించటం అనేది ఇంతవరకు ఎవరకూ చిక్కు పడని విషయం.
పైన చెప్పినట్టు బలం ఉన్నవాడు బలహీనుడిని కొడుతున్నాడు . బలం అనేది ఒక గుర్తు. బలం అనేది రకరకాలు గా ఉండ వచ్చు. ఒక్క శారీరకమే కాదు. సమర్థించే వాడు ఎందుకు సమర్తిస్తున్నాడు . మనకెందుకు ,ఇంకా కొట్టాలి అనే రకాలుగా అనుకుంటున్నాడు? ఇక్కడ విమర్శ వచ్చేసరికి కేవలం అలంకార శాస్త్రాలు చాలవు . అలంకార శాస్త్రం ఒక్కటే ఎందుకు చాలదంటే , మనం లేచింది మొదలు మన చుట్టూ వున్న జీవితం ,మన జీవితం ,మన నరాల ఇంపల్స్,జీవితమ్ లో వున్న అనేక సంగతులు . మనల్ని ప్రభావితం చేస్తున్న మార్గాలు,మన మానసికమైన కారణాలు ,ఇవన్ని కూడ మన అనుభూతి మీద పని చేస్తాయి. పై సంఘటన తీసుకుంటే,అసలు ఎందుకు కొట్టాలి వాడ్ని అన్యాయంగా అని ఒకరు చాల ఊగి పోతారు, దీనికి అతని కారణాలు అతనికి వుంటై . ఇంకా కొట్టాలి వెధవని అనుకునేవారు వుంటారు,దీనికి ఇతని కారణాలు ఇతని కుంటాయి . కొడితే కొట్టనియ్లే మన కెందుకు? మనని కాదుగా కొట్టేది అనుకుని వెళ్లి పోఎవాడికి ,వాడి కారణాలు వాడి కుంటాయి . ప్రవర్తన లన్నింటినీ ఊరికినే తప్పుకు పోవటం అన కూడదు. పుట్టినప్పటి నుండి కూడ అతని పెరుగుదలలో ,పెరుగుతున్న విధానంలో,ప్రభావితం చేస్తున్నటువంటి కారణాలు అవుతాయి.
పై సంఘటన వస్తువుగా ఒకరు కవిత్వం రాసాడను కుందాం ,రెండవ రకం చదివే వాడు , ..ఇది చెత్త కవిత్వం అని తేల్చి పారేస్తాడు. ఇంకొకరు మొదటి రకం మనస్తత్వాన్ని ఆధారం చేసుకున్న్నవాడు ,ఇదే కవిత్వాన్ని తీవ్రంగా అనుభవిస్తాడు. అందువల్ల రాసినవాడికి ,చదివిన వాడికి కూడ ఒకే రకమైన దృక్పథం వుండాలి.
కవిత్వం రాసేవాడుదృక్పథంతో నయితే రాస్తాడో ,చదివేవాడు కూడ అదే రకమయిన దృక్పథం తో చదవటం వల్లనే కవిత్వం అద్భుతంగా కనిపిస్తుంది .
రకమైన మానసిక కారణాల అంతరం వల్ల విశ్వనాధ ని హృదయ పూర్వకంగా మెచ్చుకున్న వాడు ,త్రిపురనేని ని మెచ్చుకోడు ,అలాగే త్రిపురనేని మెచ్చుకున్న వాడు విశ్వనాధ ని మెచ్చుకోడు. విశ్వనాధ వారన్నట్టు ఎవరి జీవలక్షణం వారిది.

Tuesday, May 11, 2010

లయ-నా పెళ్లి తరవాత సన్నివేశం

లయ సీరియల్ లో

ఎట్టకేలకు నా(వెంకట్రావు) పెళ్లి ,ఆజాద్ (మాధవయ్య ) చేస్తాడు.
అప్పటివరకు మామూలు దుస్తులు ధరించే నేను పెళ్లి తరవాత ఇన్ షర్ట్ చేయడం మొదలు పెడతాను .
అసలు పెళ్లి చూపుల దగ్గర నుంచే
ఇన్ షర్ట్ చేయటం మొదలు పెడతా ననుకోండి .
ఒక సారి ఆజాద్ ను చూడకుండా వెళుతుంటే ,నన్ను పిలుస్తాడు .
నేను
తండ్రి ని కాబోతున్నానని చెప్పటం,అతని ప్రతిస్పందన చూడండి.






Tuesday, May 4, 2010

పగటి వేషాలు-శక్తి వేషం-వీడియో

జానపద కళలలోపగటి వేషాలకు ప్రత్యేకత వుంది. అందులో శక్తి వేషానికి సంబందించిన చిన్న వీడియో చూడండి . మిగతా వేషాలకు సంబందించిన చిన్న చిన్న వీడియో లు కూడ నా దగ్గర వున్నాయి. పోస్ట్ చేస్తాను .



Tuesday, April 27, 2010

గుడివాడ నాటక రంగం గురించి 'ఆకాశవాణి,విజయవాడ కేంద్రం ' నుండి నా ప్రసంగాల ధారావాహిక -1

కృష్ణా జిల్లా "గుడివాడ" నాటక రంగ చరిత్ర గురించిన సమాచారాన్ని ఆకాశవాణి ,విజయవాడ కేంద్రం నుండి ప్రసంగించాను .ఆ ప్రసంగాలను ఇక్కడ పొందుపరుస్తున్నాను . వినండి . ఇది మొదటి భాగం-ఐదు నిమిషాలు. మొత్తం ఒక గంట వుంది. మిగిలినది తరువాత పోస్ట్ చేస్తాను . వీడియో చేసి పోస్ట్ చేయడం వల్ల సౌలభ్యం ఉంటుందని భావించాను . మీ అభిప్రాయాలను ఆహ్వానిస్తూ ..........తాతా రమేశ్ బాబు

Sunday, April 18, 2010

'లయ ' - కళ్యాణం కక్కు సీను






లయ సీరియల్ లో వెంకట్రావు ( నేను) ,మాధవయ్య (ఆజాద్) ను పెండ్లి చేయమని అడుగుతాడు.
ఆ సందర్భంగా ఒక సారి
వారిద్దరి మధ్య జరిగిన సంభాషణ లో 'కల్యాణం వచ్చినా కక్కు వచ్చినా ఆగవు 'అంటాడుమాధవయ్య . అప్పుడు వెంకట్రావు మాధవయ్య తో 'కళ్యాణం సంగతి మీరు చూడండి,కక్కు సంగతి నేను చూసుకుంటా' అంటాడు. ఆ సీన్ చూడండి ............

Friday, April 16, 2010

'లయ ' సీరియల్ లో పంతులు మీద జాలి

'లయ 'లో పంతులు మీద జాలి పడే సన్నివేశం లో నేను,ఆజాద్


Tuesday, April 13, 2010

కృష్ణా జిల్లా జానపద కళలు

http://www.esnips.com/newuser/2b672ef9-6b1c-46c2-b014-58af8145a09e

http://www.esnips.com/doc/d829f31f-7998-407c-af02-11d90e813824/Janapadha-Kalalu

కృష్ణాజిల్లా చారిత్రిక వైభవం -జాతీయ సదస్సులో -కృష్ణా జిల్లా జానపద కళలు అనే అంశం మీద పత్ర సమర్పణ చేసాను . ఆ ప్రసంగాన్ని ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారు రికార్డు చేసి ప్రసారం చేసారు . అది వినండి

http://www.esnips.com/web/AllIndiaRadiovijayawadaprogrammes


http://rapidshare.com/files/376825703/Janapadha_Kalalu.mp3.html

'లయ ' సీరియల్ లో ఒక సన్నివేశం

ఈ క్రింది లింక్ ను క్లిక్ చేయండి 


http://www.youtube.com/watch?v=reiO8_ETzjk


లయ సీరియల్ లో వెంకట్రావు గా పెళ్ళి అయిన తరువాత నడక చూడండి . ఇందులో వెంకట్రావు గా నేను ,మాధవయ్య గా పి.చంద్ర శేఖర ఆజాద్ నటించాము

Sunday, March 21, 2010

నా గురించి

                       నా పేరు తాతా రమేశ్ బాబు.ఇందులో విశేషమేమి లేదు కానీ మా ఇంటి పేరు 'తాతా' అని వుండటం ,అది వినగానే ఎదుట వారి మొహం లో నవ్వు పూయటం-నా చిన్న నాటి నుండి గమనిస్తూనే వున్నాను. నేను గుంటూరు జిల్లా భట్టిప్రోలు గ్రామం లో పంతొమ్మిది వందల అరవై సంవత్సరం జనవరి నెల పదిహేను వ తారీఖున పుట్టానట.మా నాన్న పేరు బసవలింగం ,అమ్మ పేరు బోలెం లక్ష్మి నరసమ్మ . మా అమ్మ గారి వూరు కృష్ణాజిల్లా దివితాలుకా, లక్ష్మీపురం . మా నాన్న విద్యా శాఖ లో పాటశాలల తనిఖి అధికారిగా వుద్యోగిస్తున్డటం వల్ల నా బాల్యం అంతా కృష్ణా జిల్లా లోనే గడచింది. వుయ్యూరు,కైకలూరు,మొవ్వ,అవనిగడ్డ లలో తొమ్మిదవ తరగతి వరకూ చదువుకున్నాను. ఆ బాల్యం నా జీవితం లో మరపు రాని ఒక అందమైన పూలతోట.పదవతరగతి మచిలీపట్టణం జైహింద్ హై స్కూల్ లో నూ,ఇంటర్మీడియట్ మరియు డిగ్రీ లను ఆంధ్ర జాతీయ కళాశాల లోనూ చదువుకున్నాను. డిగ్రీ ఆఖరి సంవ్వత్సరం లో వుండగా మద్రాసు సిని పరిశ్రమ కు అసిస్టెంట్ ఆర్ట్ డైరెక్టర్ గా వెల్లవలసి వచ్చింది. అందువల్ల డిగ్రీ పూర్తి చేయలేఖ పోయాను.
            నాకు చిన్ననాటి నుండి లలిత కళలు అన్నా,ఆటలు అన్నా చాలా ఇష్టం.
           ఆంధ్ర జాతీయ కళాశాలలో వున్నప్పుడు హాకి,ఫుట్ బాల్,బాస్కెట్ బాల్,ఆటలే కాక పరుగు,పోల్వాల్ట్, మొదలైన ఆటలు ఇష్టం గా ఆడేవాడి ని .కృష్ణా జిల్లా బాస్కెట్ బాల్ టీం లో ఆడాను.ఇంటర్ కాలేజీ హాకీ లో ఆంధ్ర యూనివెర్సిటీ పోటిలలోరన్నర్ అప్ టీం లో వున్నాను. హాకీ ఆడటం లో నేను ప్రత్యేక శైలి లో ఉండేవాడిని.ఆ తర్వాత ఆటలు ఆడటం మానేసాను.
            నా పదవతరగతి నుంచే గేయాలురాయటం ,నాటకాలు వేయటం మొదలు పెట్టాను.నా రచనలు చాలా దిన ,వార పత్రికలలో ప్రచురించ బడేవి. ప్రచురించబడిన నా పుస్తకాలు,అణువు పగిలింది (కవిత్వం),పిడికిలి (దీర్ఘ కవిత),తాతా రమేశ్ బాబు కథలు,విప్లవరుతువు(కవిత్వం),తోలిగీతలు,దిద్దు బాటు(బొమ్మలాట),తయారు చేద్దాం(క్రాఫ్ట్ వర్క్),అసలు నిజాం(బొమ్మలాట),నాన్నో పులి (బొమ్మలాట),బొమ్మలాట (బొమ్మలు తయారు చేసి ఆడించటం),శుభాకాంక్షలు(అభినందన పత్రాలు),లయ (ఆకాహవానిసమిక్షలు ) ,నా దేశం (దీర్ఘ కవిత),తాతా రమేశ్ బాబు చిత్రకళ,బాలభందు బివి జీవిత చరిత్ర.
            రెండు వేల అయిదవ సంవత్సరం లో మచిలీపట్టణం నుండి వెలువడిన 'జనప్రభ' సాహిత్యమాస పత్రిక కు సంపాదకుడిగా వ్యవహరించాను. రెండువేల ఆరవ సంవత్సరం లో జాతీయ తెలుగు రచయితల మహాసభలకు ముఖ కార్యకర్త గా సేవలను అందించటమే కాక,ఆంధ్ర ప్రదేశ్ అవతరణ స్వర్ణోత్సవాల నేపధ్యం లో యాభై ఏళ్ళ తెలుగు భాష ,సంస్కృతి, సాహిత్య వికాసాల సమీక్షా గా వెలువడిన నూట పన్నెండు వ్యాసాల వ్యాసాల సంకలనం 'తెలుగు పసిడి' గ్రంధానికి ఉప సంపాదకుని గా వున్నాను.అలాగే రెండువేల ఏడు సంవత్సరం లో ప్రపంచ తెలుగు రచయితల మహాసభలలో ముఖ్య కార్య కర్త గా సేవలను అందిస్తూ,భారత స్వాతంత్ర వజ్రోత్సవాల నేపధ్యం లో వివిధ రంగాలలో తెలుగు వారి అరవై ఏళ్ళ ప్రగతి సమీక్ష గా రెండు వంద్దల పదమూడు వ్యాసాల సంకలనం 'వజ్ర భారతి ' వుద్గ్రందానికి సంపాదక వర్గం లో వున్నాను.
             ఇక రంగస్థలం మీద ఫలించని వంచెన నాటిక లో కథానాయిక గా,ఏక్ దిన కా సుల్తాన్ లో మీసాల వెంకటరత్నం గా మనుషులోస్తున్నారు జాగ్రత్త లో రెడ్డి గా ,క్రాంతి లో రామారావు గా ,ది ఇంసిడెంట్ లో బ్రాహ్మణుడు గా ,తాకట్టు లో జ్ఞానేశ్ గ,కీర్తిశేషులు నాటకం లో మురారి గా,-ఆకాశవాణి,విజయవాడ కేంద్రం లో రాంబాబు కాపరం లో రాంబాబు గా ,జాతీయ నాటకం నాదయోగి లో రామరాయుడి గా ,అపూర్వ నరకం లో తమిళ అయ్యర్ గా,-హైదరాబాద్ దూరదర్శన్ లో మొదటికే మోసం బొమ్మాలాట లో పప్పెట్ గా ,సంసారం సాగరం మెగా సీరియల్ లో మంత్రగాడుగా, మినీ మూవీ లో గంగిరెడ్డి గా, లయ సీరియల్ లో వెంకట రావు గా,అబ్బాయి ప్రేమలో పడ్డాడు చలన చిత్రం లో గుండు అనుచరుడు గా , నటించటం జరిగింది.
           ఆకాశ వాణి విజయవాడ కేంద్రం నుండి ,తొలి రంగుల సినిమా బొమ్మలాట నూ వివిధ భారతి లో ఇవ్వటం ,పగటి వేషాలు,సామాజిక ప్రయోజనం అనే అంశం మీద మూడు వారాల ధారావాహిక ప్రసంగాలు,గుడివాడ నాటక రంగం మీద మూడు వారాల ప్రసంగాలు ఇచ్చాను.
           అంతర్జాతీయ సంస్థ ఆర్ధిక సమతా మండలి,శ్రీకాకుళం లో అయిదు సంవస్త్సరాలుగా కొన్ని వందల మంది బాల బాలికలకు ,అంగన్వాడి కార్యకర్తలకు ,ఒరగామి,నమూనాలు తయారు చేయటం,స్క్రీన్ ప్రింటింగ్,మొదలయిన అనేక కళల లో సృజనాత్మక శిక్షణ ఇస్తున్నాను.
అయిదు లక్షల కు పైగా అభినందన పత్రాలు,సూక్ష్మ చిత్రాలు,నిటి తైల వర్ణ చిత్రాలు చిత్రించాను.
           గుడివాడ పురపాలక సంఘ పాటశాల అయిన అడుసుమిల్లి గోపాల కృష్ణయ్య పురపాలక ఉన్నత పాటశాల లో చిత్ర కల ఉపాధ్యాయుని గా పంతొమ్మిది వందల ఎనభై అయిదు నుండి పని చేయు చున్నాను.



 నేను    పదవతరగతి లో     వున్నపుడు




నేను    డిగ్రీ    చదువుతున్నపుడు







Saturday, March 20, 2010

గుడివాడ నాటక రంగం

 ఈ ప్రసంగాలు,  2010 సం .   ఫిబ్రవరి    9 ,  16 ,  23   తేదిలలో  విజయవాడ ఆకాశవాణి కేంద్రం నుండి ప్రసారం అయినాయి.                    వారి సౌజన్యం తో ...........


గుడివాడ నాటక రంగం

                       ఒకటిన్నర శతాబ్దాల తెలుగు నాటక రంగ వనం లో విరబూసిన నటకుసుమం గుడివాడ నాటక రంగం. వెండితెర కంఠానికి తలుకులీనే తారలను ,నేపధ్య సంగీతానికీ,గానానికి అజరామరమైన స్వరాన్ని అలంకరించింది గుడివాడ. అందుకేనేమో దృశ్య శ్రవ్య కావ్యాలలో 'నాటకం' రమ్యమై గుదివాడను తన శిగలో తురుముకుంది, పౌరాణిక ,చారిత్రాత్మక ,సాంఘీక నాటకాలు ప్రదర్శించ టంలో ప్రత్యేకంగా నిలచింది. ఎంతో మంది నటులు ,నటీమణులు,సంగీత విద్వాంసులు, నృత్యకారులు,రచయితలు,చిత్రకారులు,జానపద కళాకారులు,నాటక సంస్థలు,డ్రామా డ్రెస్ కంపెనీలు,వివిధ వాయిద్య కారులతో సుసంపన్న మయి తెలుగు నాటక రంగాన మకుటాయమానం గా నిలచింది గుడివాడ.
కళలకు కాణాచిగా,కాకలు తీరిన నటులను అందించి కళామతల్లికి నీరాజనాలు సమర్పించింది. నటగాయకుదుగా అమర గాయకుడు ఘంటసాలను ప్రపంచ గాత్ర తోరణంగా ,మహా గాయకుడి గా అందించినా ,దాదా సాహెబ్ ఫాల్కిఅవార్డు గ్రహీత పద్మశ్రీ అక్కినేని నాగేశ్వర రావు చే రంగస్థల అరంగేట్రం చేయించినా ,నవరస నటనా సార్వభౌమ కైకాల సత్యన్నారాయణ నటనకు నడకలు నేర్పించినా ,నట గేయ రచయితగా జాలాది కి బీజం వేసినా ,రేడియో ఏకాంబరం గా వి.సత్యన్నారాయణ ప్రసిద్దులు అయినా ,ఆయన నడకే నక్యత్యం గా భావ నాట్యానికి ఊపిరి పోసిన 'బాలభందు' బి.వి.నరసింహా రావు లాంటి కీర్తి గడించిన ఎందరికో పురుడు పోసి బుడి బుడి నడకల నటనను నేర్పి దిగ్గజాలు గా మలచింది గుడివాడ నాటక రంగం.
                    'అచట పుట్టిన నటులు ఏ పాత్రకు అయినా ఓడిగిపోవు' అన్నట్లు గా ,గుడివాడ నాటక రంగాన పురుషులు,స్త్రీ పాత్ర ధరించటం-స్త్రీలు పురుష పాత్ర ధరించటం మరో ప్రత్యేకత . అందరూ స్త్రీ లతో రంగూన్ రౌడి ,సతిసక్కుబాయి,రామాంజనేయ యుద్ధం,తదితర నాటకాలు ప్రదర్శించి ఇక్కడి నటీమణులు తమ నటనా సామర్ధ్యాన్ని 'ఔరా' అని చాటుకున్నారు.
కాగా,అక్కినేని నాగేశ్వర రావు,దేవరకొండ రామారావు ,బాలభందు బి,వి,నరసింహ రావు,తుమ్మలపల్లి సాంబశివరావు,దావులురి రామారావు, పెండ్యాల నాగేశ్వర రావు,మొదలైనవారు స్త్రీ వేషం కట్టి హొయలు ఒలికిస్తే,గుంటూరు కోమలి,పువ్వఅనసూయ,నాగరాజకుమారి,కోతిస్వరి,మొదలైనవారు పురుష వేషం వేసి దడ దడ లాడించారు.
పదకొండు ఏళ్ళ ప్రాయం లోనే అక్కినేని నాగేశ్వర రావు మాతంగి కన్య,లోహితాస్యుడు వేషాలు వేయించారు.కోడూరు అచ్చియ్య వీరికి గురువు, వై.భద్రాబాడి హరిచ్చంద్రుడు గా ,వీరి సతిమని అమ్మని బాయి చంద్రమతి గా నటిస్తుంటే చూడటానికి రెండు కన్నులు చాలేవి కావట.గుడివాడ దగ్గర రామాపురం లో జన్మించిన అక్కినేని గుడివాడ వచ్చి రంగస్థలం పయి నటించే వారు. సూరపనేని శోభన రావు రచించిన 'సత్యాన్వేషణ ' నాటకం లో అక్కినేని ఒక క్రిస్తావ యువతీ గా వేషం కట్టారు.దేవుడు ఎవరు? ఎక్కడ? అనే సంభాషణతో మొదలయ్యే ఈ నాటకం ఒక పల్లె లో ప్రదర్శిస్తుండగా తెర లాగే వాడిని తెలు కుట్టిన దట. ఒక గ్రామం లో ఆడుతుండగా ఒక గేదె మరణించిందట. దేవుడు లేదని చెప్పటం వల్లనే ఈ అనర్థాలు జరిగాయని అప్పటి ప్రజలు చెవులు కోరుక్క్కున్నారు.హర్మోనిస్ట్ మోటూరు వీర రాఘవయ్య చౌదరి అక్కినేని కి పద్యాన్ని పాడటం నేర్పించారట.
నటులు దావులురి రామారావు చంద్రమతి గా ఆడవేషం వేసేవారు. ప్రఖ్యాత సినీ గేయ రచయిత జాలాది నటిస్తూ ,పాటలు రాసి పాడే వారట. పంతొమ్మిది వందల అరవై రెండు లో కవిరాజ కళామందిరం లో కవిరాజ త్రిపురనేని రామస్వామి చౌదరి రాసిన ఖూని నాటకాన్ని ప్రదర్శించారు. కోడూరు అచ్చయ్య ,చల్లగుల్ల సుబ్బారావు ,వీరస్వామి తదితరులు నటించారు.
గుడివాడలో విద్యా రంగాన్ని అభివృద్ది చేయాలనే సంకల్పం తో అక్కినేని లక్ష రూపాయలు ఆర్ధిక వనరులను సమకూర్చి అక్కినేని నాగేశ్వరరావు కళాశాల గా తీర్చి దిద్దటానికి కృషి చేసారు. రెండు వేల తొమ్మిది నవంబరు ఇరవై తేదిన అక్కినేని సంత వూరు రామాపురంలో అక్కినేని నట జీవితాన్ని ప్రతి బిమ్బించే చాయా చిత్ర శాశ్విత ప్రదర్శనను అక్కినేని చేతుల మీదుగా ప్రారంభించారు.
                    పంతొమ్మిది వందల యాభై ఒకటి నుండి పంతొమ్మిది వందల యాభయ్ ఆరు వరకూ గుడివాడ లో పలు నాటక ప్రదర్శన లలో ముఖ్య పాత్రలు ధరించారు కైకాల సత్యన్నారాయణ . ఆత్రేయ రాసిన ఎవరు దొంగ లో ఎస్సయి గా ,పినిశెట్టి రాసిన పల్లెపడుచు లో హీరో చంద్రం గా ,కొర్రపాటి గంగాధరరావు రాసిన బంగారు సంకెళ్ళు ,తెలుగు కోపం ,మొదలైన నాటకాలలో నటించారు. పంతొమ్మిది వందల దేభ్భయ్ ఆరు లో గుడివాడ కైకాల కల మందిరం నిర్మించటానికి ఇరవయ్ అయిదు వేల రూపాయలను ఆర్ధిక వనరులను అందించారు.
                     పంతొమ్మిది వందల ఇరవైతొమ్మిది స. లో ఆంధ్ర నాటక కలాపరిస్హాడ్ కార్యాలయం ,గుడివాడ శాఖ ను కాజ వెంకట్రామయ్య ,సిని నిర్మాత దుక్కిపాటి మధు సూధనరావు ,నట న్యాయ నిర్ణేత పోలవరపు సూర్య ప్రకాశరావు ,వైణికులు త్రిపురనేని శివ ప్రసాద రావు ,ఏర్రోజు మాధవా చార్యులు, మొదలైన వారు స్థాపించారు. ఈ కార్యాలయానికి ఆచార్య ఆత్రేయ కార్యదర్శిగా పనిచేసారు. ఆయన ఎందఱో నటీనటులకు శిక్షణ ఇచ్చారు .ఎన్జీవో ,ఎవరు దొంగ ,నాటకాలు రాసి ప్రదర్శించారు. పంతొమ్మిది వందల నలభై ఎనిమిది లో ఆంధ్ర నాటక కల పరిషత్తు పోటిలలో ఎవరు దొంగ నాటకానికి ప్రదర్శన ,దర్శకత్వం, ఉత్తమ నటనలకు బహుమతులు వచ్చాయి .
                      పంతొమ్మిది వందల నలభయ్ ఆరు లో గుడివాడ లో నిర్వహించిన ఆంధ్ర నాటక కళాపరిషద్ సభలు చరిత్ర లో మైలురాయి గా నిలచాయి. ఏడు నాటకాలను ఎంపిక చేసి ఒతిలు నిర్వహించారు. పోటికి వచ్చన నాటకాలతో పాటు పిల్లలు ప్రదర్శించిన అనార్కలి నాటిక, కల్పకం అనే బాలిక నృత్యం,బోలోనాథ్-సరోజమ్మల రాధాకృష్ణ నృత్యం.,పాముల వాళ్ళ నృత్యం,ఒక బాలుడు ప్రదర్శించిన కథక్ నృత్యం ఏర్పాటు చేయడం విశేషం. పంతొమ్మిది వందల నలభయ్ నాలుగు లో పరిషత్ పునర్వ్యవస్తికరించటం వాళ్ళ నటులు ,న్యాయ నిర్ణేత పోలవరపు సూర్య ప్రకాశ రావు క్రియా శీలక పాత్ర ను పోష్ణ్చారు. పరిషత్ కార్యక్రమాలలో ,పరిషత్ పోటిలకు వచ్చన నాటకాలను ప్రాధమిక పరిశీలనలో ఎంపిక చేసే భాద్యత సమర్హంగా నిర్వహించారు. పంతోమ్మితి వందల ఎనభై మూడు పరిషత్ ప్రధాన కార్య దర్శిగా ఎంపికై పత్తేనిమిది స.లు ,ఆ పదవి లో వుంది ,పరిషత్ ప్రగతికి కృషి చేసారు.
                  ముదినేపల్లి నుండి గుడివాడ కు తరలి వచ్చిన ఎక్షెల్శియర్ నాట్య మండలి లో కోడూరి అచ్చయ్య దర్శకత్వం లో అక్కినేని,దుక్కిపాటి,సూరపనేని,సహా నటులుగా ఆశాజ్యోతి ,సత్యాన్వేషణ ,తెలుగు తల్లి నాటకాలలో శ్రీ పోలవరపు సూర్య ప్రకాశ రావు నటించారు.
పంతొమ్మిది వందల ఎనభై లో నందమూరి తారక రామారావు కలనగర్ పేరుతో గుడివాడ దగ్గరలో వున్నబిల్లపాడు గ్రామం లో యాభై ఏడు మంది కళాకారుల కు నూటయాభై గజాల భూమి ని పంచి ప్రభుత్వం కూడా గుడివాడ రంగస్థలానికి ప్రత్యేకత నిచ్చింది.
దాదాపు ముప్పై నాటక సంస్థలు ,వందల కిఒద్ది నటినటులు,దర్శకులు,ఎంతో మంది హార్మోనియం,మృదంగ ,తబలా ,డోలక్, కీబోఅర్డ్ ,వయోలిన్ ,కళాకారులు,మేకప్మెన్ లు ,రంగాలంకరణ,నేపధ్యగానం,లైటింగ్,కళాకారులు,డ్రామా డ్రెస్ కంపెనీలు,,సిని సెట్టింగ్ కంపెనీలతో అలరారి శోభాయమానంగా వెలుగొందిన గుడివాడ నాటక రంగం గురించి చెప్పలంటే మాటలు చాలవు. బొమ్మాలాట కళాకారులు ,జానపద కళాకారులు,వందకు పయిగా ,నేటికి తమ కళలను నముకొని జీవిస్తున్నారు.
                  గుడివాడ కు సమీపం లో వున్న బిళ్ళపాడు కళాకారుల కాలనీలో ,పగటి వేషాలు ,బుర్ర కథలు ,తంబుర కథలు,పౌరాణిక నాటకాలు, వీదినాటికలు మొదలైన కళలను ప్రదర్శించే కళాకారులు ఏభై మందికి పయిగా నేటికి వున్నారు. డెబ్బయి రెండేళ్ళ మిరియాల దురగా ప్రసాద్ వీరికి పెద్ద. అనువంశికంగా వస్తున్న కళలను కుటుంబ సభ్యులకు భోధించి పది బుర్ర కథ దళాలను ,మూడు వీధి నాటిక బృందాలను,ఎనిమిది పగటి వేష బృందాలను,మూడు దేవర పెట్టె బృందాలను,తయారు చేసి వృత్తి కళాకారులు గా జీవనం సాగిస్తున్నారు. రామపరశురామ ,భీమాంజనేయ యుద్ధం,రావణ బ్రహ్మ అంగదుడు,శ్రీకృష్ణ జాంబవంత యుద్ధం,మొదలయిన నాటకాలను వీధి లో ప్రదర్శిస్తారు .
                     మిరియాల శేఖర బాబు ,విశ్వనాథ బాబు,యదవిల్లి రమణ,మిరియాల రవితేజ,యదవిల్లి వీరయ్య ,మిరియాల ప్రశాంత్,యదవిల్లి దుర్గారావు,రమేశ్, మొదలయిన ఇరవై మంది కి పయిగా కళాకారులు ఈ బృందాలకు నాయకత్వం వహిస్తున్నారు. అరవై ఏళ్ళ కు పయిబడిన యడవల్లి తిరుపతమ్మ ,అచ్చమ్మ,మొదలైనవారు తంబురకత ను చెప్పటం లో ఘనాపాటి లు విజయవాడ ఆకాశవాణి, దూరదర్శన్ నుండి అనేక కార్యక్రమాలను సమర్పించారు.వీరి పగటి వేషాల గురించి నేను ఇంతకు ముందు ఆకాశ వాణి శ్రోతలకు ధారావాహిక ప్రసంగాల ద్వారా తెలియ చేసి వున్నాను.
                   పంతొమ్మిది వందల తొంభై సం.నుండి నేను, తాతా పప్పెట్ దియేటర్ స్థాపించి తొడుగు,కర్ర బొమ్మలు, మిశ్రమ బొమ్మాలు,తయారు చేసి, నాటికలు రాసి ప్రదర్శన లిచ్చాను. రంగస్థలం పయినే కాకుండా హైదరాబాద్ దూరదర్శన్ కేంద్రం నుండి ప్రదర్శనలిచ్చాను . దిద్దుబాటు,మొదటికే మోసం,నాన్నో పులి ,ఈ పనులు మా కొద్దు,లాంటి బొమ్మలాట నాటికలు ఎన్నో రచించి ప్రదర్శనలు ఇచ్చాను. బొమ్మలు తయారు చేయటం,రచన చేయటం,బొమ్మాల కదలికలు రూపొందించటం ,లో అక్కినేని కళా పీటం లాంటి సంస్థలలో కార్యశాలలు నిర్వహించాను. అనేక సంఘీక నాటకాలలో పలు పాత్రలతో పాటు ఆకాశవాణి,టివి నటుడు గా భిన్న పాత్రల్లు పోషించాను. లయ ధారావాహిక లో వెంకట్రావు పాత్రలో ,ప్రముఖ టివి లో నటిస్తున్నాను.
సాహిత్య,సంగీత ,శిల్ప,చిత్ర,వాస్తు కళల సమ్మేళనంగా బొమ్మలాట ను రూపొందించాను.
                      సినిమాలు,టివిలు వచ్చాక గుడివాడలో సంఘీక ,పౌరాణిక ,చారిత్రాత్మక నాటకాలు కుప్పకులిపోయాయి.పండగలప్పుడు,పందిల్లలోను,అడపా దడపా వీళ్ళ మీదా లేక్కిన్చాదగ్గ నాటకాలు మాత్రమె ప్రదర్శిస్తున్నారు. సమీపంలో వున్న పల్లెలలో ప్రదర్శించే నాటకాలు సినిమాకు అనుకరణలుగా, పాటలు, డాన్సులు, చిత్ర విచిరాలుగా ప్రదర్శించ బడుతున్నాయి. ఇందుకు గుడివాడ నుంచే సెట్టింగు డ్రామాల సప్లయ్ కపెనీలుగా సహకారం అందిస్తునారు. ఒక రకంగా పచ్చి రికార్డింగు డాన్సు ద్రామాలాయి పోయాయి. స్థానిక కళాకారులతో పాటు ,వీరికి నాయికలను ,సెట్టింగు లనుందించే కంపెనీలు నీలా మహల్ రోడ్డులోవున్నాయి .
                      పంతొమ్మిది వందల ఎనభై లో ప్రసాద్ సిని సెట్టింగ్స్, పన్థొమీది వందల తొంభై అయిదు లో భాష సిని సెట్టింగ్స్, ఇటివల పెద్దులు డాన్స్ పార్టీల లాంటివి ప్రస్తుతం పని చేస్తున్నాయి. మొత్తం పది మంది కధానాయిక లున్నారు. ఒక్కో కంపెనీ సం.లో ఏభై నుండి వంద దాకా నాటకాలకు కాంట్రాక్టు కుదుర్చు కుంటారు. ఒక్కో నాటకానికి పది నుండి ఇరవై వేల రూపాయిల దాకా మాట్లాడుకుని ,సంగీతం,స్టేజి దేకరేసన్ ,లిఘ్తింగ్, మేకుప్ వగైరాలను అందిస్తుంటారు. కధానాయికల నటనను బట్టి వెయ్యి నుండి రెండు వేల దాకా దక్కించుకుంటారు.              చత్రపతి,రాణాప్రతాప్,నిప్పురవ్వలు,సూర్య సింహాలు,జగత్ కంత్రీలు,మొదలయిన నాటకాలు ప్రదర్శిస్తుంటారు ,ప్రస్తుతం ఈ కంపెనీల మీద ఆధారపడి మూడు వందల మంది కళాకారులు,కార్మికులు బ్రతుకు తున్నారని ప్రసాద్ సిని సెట్టింగ్స్ అధినేత టివి ప్రసాద్ చెప్పారు. కార్మికులు రెండు వందల నుండి మూడు వందల దాకా వేతనాన్ని ఇస్తున్నామని ,ప్రదర్శనలు లేని రోజుల్లో ఎదైనా కూలి కి వెళ్లి జివనానిసాగిస్తూ న్నారు.


గుడివాడ నాటక రంగాన్ని పరి పుష్టం చేసిన కిన్తమంది కళాకారుల గురించి తెలుసుకుందాం.


'బాలభందు' బివి నరశిహారావు : జననం: మరణం :


                          నటుడు,నాట్యాచార్యుడు,చిత్రకారుడు,బాల గేయ రచయితగా గుడివాడ పేరు ను దేశమంతటా చాటిన వీరి పూర్తి పేరు బాడిగ వెంకట నరసిహారావు . రంగస్థలం మీద స్త్రీ వేషధారణ చేయటం లో ప్రసిద్ద్లు లు పంహోమ్మిది వందల ముప్పయి నెండి పంతొమ్మిది వందల యాభయి ఎనిమిది వరకూ ఎనో ప్రదర్శన లిచ్చిన బివి గారి స్వగ్రామం కౌతవరం అయినా ,గుడివాడ లో స్థిర నివాసం ఏర్పరచుకొని కళాకారునిగా ప్రసిద్ది కెక్కారు.
అభినయం ,సంగీతం,చిత్రలేఖనం,వీరికి ఆజన్మసిడ్డం గా ప్రాప్తించాయి. తోటి పిల్లలతో కలసి ఆవూ పులి,హరిశంద్ర,ధ్రువ,మొదలయిన చిన్న నాటకాలు వేయడంతో ప్రారంభమయినది వీరి రంగస్థల జీవితం. గయోపాఖ్యానం లోని కృష్ణార్జునుల సంవాదాన్ని ,పరబ్రహ్మ శాస్త్రి గారు వేయించారు. ఇందులో అర్జునుడు గా బివి. పదిహేడు గజేంద్ర మోక్షం కథా గీతాన్ని ఆనంద భైరవి రాగాన్ని ,ఆటతాలం లో నేర్చుకొన్నారు. వీరికి రాచప్ప పాడిన 'మగదోచ్చి పిలిచెను' ,వనజాక్షి పాడిన 'ఓరోరి బండివాడ' పాటలు బాగా ఇష్టం. కూచిపూడి భాగవతుల యక్ష గానాలు,దేవదాసి నృత్యం, చూచిందే తడవు గా అభినయించేవారు. మినర్వా సంస్థ తీసిన 'అనార్కలి' ముకి చిత్రాన్ని నాటకంగా మలిచారు వింజమూరి వెంకట లక్ష్మి నరసింహారావు. ఇందులో అనార్కలి పాత్రకు బివి ని ఎంపిక చేసారు. కిలాంబికృష్ణమా చార్యులు వద్ద అనార్కలి నాట్య శిక్షణ తీసుకుంనారు బివి. ఈ నాటకాన్ని పంతొమ్మిది వందల ముప్పయి లో ప్రదర్శించి ప్రసంసలండుకున్నారు. వీరి వద్దే తులాభారం లో సత్య భామ ,రుక్మాంగదలో మోహిని,చింతామణి లో చింతామణి,పాత్ర్రా భినయాన్ని క్షుణ్ణంగా అభ్యసించి ప్రదర్శించారు. నాటకాల్లో వేషాలు వేసి ,నృత్య ప్రదర్శనలు ఇచ్చి సంపాదించిన డబ్బులు ఇంటికి పంపేవారు. పంతొమ్మిది వందల నలభయ్ లో మద్రాసు ఆంధ్ర సంగం లో వీరి సరసన సలీం గా బందా కనక లింగేశ్వర రావు గారు నటించారు. స్థానం నరశింహారావు ,బళ్ళారి రాఘవ,సిఎస్సార్ ,నగరాజారావు,కస్తూరి శివరావు, రేలంగి వెంకట్రామయ్య, మొదలయిన గొప్ప నటులతో కలసి ఎన్నో స్త్రీ పాత్రలలో నటించారు. క్షణం లో చీర సింగారించి కోవటం వీరి సొత్తు . సినీ నటి సావిత్రి కి నృత్య శిక్షణ ఇచ్చారు. అక్కినేనికి ఆడవేషాలు వేసే కాలంలో అభినయంలో శిక్షణ ఇచ్చరు. ఆంధ్ర జాలరి సంపత్కుమార్ వీరి ప్రశిష్యులు. శ్రీమాన్ నమ్మాళ్వారు కుమార్తె సత్యరంగా కు జానపద రీతులలో శిక్షణ ఇచ్చరు. అంతర్జాతీయ ఖ్యాతి పొంచిన కోరాడ నరసింహా రావు వీరికి ఏకలవ్య శిష్యులు. ఆచార్య ఖండవల్లి నిరంజనం సంకలన పరచిన 'సంగ్రహ ఆంద్ర విజ్ఞాన సర్వస్వం' లో వీరి వ్యాసం 'జానపద నృత్యాలు' ప్రకటించారు.
చల్లపల్లి,ముక్త్యాల, జయంతిపురం,బొబ్బిలి, వేగాయమ్మ పేట, సంస్థానాలలో జానపద నాట్యం చేసారు. బందరు టౌన్ హాల్ లో మునిమాణిక్యం నరసింహారావు వీరి నాట్య ప్రదర్శన ఏర్పాటు చేసారు. ఈ ప్రదర్శనకు చిత్రకారుడు రచయితా అడవి బాపిరాజు వ్యాఖ్యాత. ఈ నాట్యం చుసిన జ్ఞానపిట్ అవార్డు గ్రహీత విశ్వనాథ సత్యన్నారాయణ 'భావనాత్యం' అని పేరు పెట్టారు. పంతొమ్మిది వందల నలభయ్ నాలుగు లో బందరు నాటక కల పరిషత్తు లో స్థానం వారు బివి నాట్యానికి ముగ్ధులై బంగారు పతాక మిచ్చారు. ఎంకి పాటలు,కవి కొండల రావు జానపదాలు,బంద్గారి మామ పాటలు,ప్రాచీన జానపదాల తో పటు,భావగీతాలు అయిన శ్రీశ్రీ 'ఆనందం అర్ణవమైతే'కృష్ణ శాస్త్రి 'ఓహో వసంతా,దాసిగా నుండుట కయినా తగునా' తాపీ ధర్మారావు ,వేదుల సత్యన్నారాయణ శాస్త్రి గారి గీతాలతో ఏకబిగిన మూడు గంటల ప్రదర్శన ఇచ్చే వారు. ఈ నాట్యం ప్రత్యేక లక్షణాలను వివరిస్తూ ,'ఈ కళను నేను నేర్చుకొన్నది,ఇతరులకు నేర్ప్న్డీ, కవితా కల్పనా వైఖరి తోనే. నర్తక్నికి ముందు కవి హృదయం వుండాలి. లయ ఆయువు పట్టి ,అందం చిందించటం అభిమాన విషయం కావాలి. పాటలో జీవించాలి. భావ వ్యక్తీకరణకు ,సుకుమార అంగ భంగిమలకు ,వంగే శరీరం కలిగి వుండాలి' అన్నారు.
ఒకసారి వీరి నాట్యాన్ని చూసిన నార్ల వెంకటేశ్వర రావు ,నాట్య కలక్ను చేపట్టి ప్రచారం చేస్తే ,రాణించా గలవని చెప్పారు. పన్థొమీది వందల్ల యభైఎనిమిది నుండి నాట్య ప్రదర్శనలు ఇవ్వటం ఆపేసి బాల రచయిత గా ఎదిగారు.
సామాన్య కుటుంబం నుండి బహుముఖ ప్రజ్ఞాశాలి గా ఎదిగిన బివి పంతొమ్మిది వందల అరవై ఎనిమిది లో ఉద్యోగ విరమణ చేసి గుడివాడ లో స్థిర నివాసం ఏర్పరచుకొని నృత్య,సంగీత, సాహిత్య, నటనల మేలవిమ్మ్పుతో మధుర జీవితాన్ని గడిపారు. బాలలకోసం బాలుడై ఎన్నో రచనలు బాలలకు అందించి 'బాల బంధు' గా సత్కరించ బడ్డారు. 'భారత కళా నిధి' గా బిరుదు పొందిన బివి ,ఆప్త మిత్రుడు గుడిపాటి వెంకట చలం శత జయంతి సభ కు అధ్యక్షత వహించేందుకు విజయవాడ పుస్తక మహోతవానికి వెళ్లి తీవ్ర అస్వస్థత తో పంతొమ్మిది వందల తొంబై నాలుగు జనవరి ఆరవ తేదిన గుండె పోతూ తో మరణించారు.




బుస్సీ దొరగారు అని పిలుచుకొనే                            'మామిడాల వెంకట కృష్ణారావు :


                     గుడివాడ వాసవాంబ రైస్ మిల్లు లో ఎక్కౌన్తెంట్ గా పని చేస్తూ అనేక నాటకాల్లు ప్రదర్శించారు. 'సక్కుబాయి'లో కాశిపతి గా అమాయకత్వాన్ని ,రెండు రెళ్ళు ఆరు లో మధ్య తరగతి పెద్ద గా, పల్నాటి యుద్ధం లో బ్రహ్మ నాయుడి గా హుందాతనం ప్రదర్శించటం లో ఆరితేరారు.
ముఖ్యం గా వీరు 'బుస్సీ' కృష్ణా రావు గా ప్రసిద్ది చెందారు. బొబ్బిలి యుద్ధం లో 'బుస్సీ' పాత్రను సజేవం గా ప్రేక్షకుల ముందు ఉంచారు. బుస్సీ దొర కోటు ఎలా వేసుకోవాలి,సిగార్ ఎలా పట్టుకోవాలి,హుందా గా ఎలా నడవాలో ,చూడటానికి చల్లపల్లి జమిందారు శ్రేమంతు యార్లగడ్డ అంకినీడు ప్రసాద్, గుడివాడ కు వచ్చి వీరి నాటకాన్ని చుచేవారట. సహనటులు తుర్లపాటి రాధాకృష్ణ, నాజర్వాలి తదితరులతో ప్రదర్శించిన 'బుస్సీ' ,ఫ్రెంచి దొర ,మాట్లాడే భాష ఆంగ్లం,పైగా విదేశీయులు మాట్లాడే రీతిలో వుండాలి. నటనలో కుటిలత్వం ప్రదర్శించటంలో జీవించేవారు. 'బొబ్బిలి యుద్ధం ' నాటకాన్ని ఆంధ్ర ప్రదేశ్ అంతటా పలు ప్రదర్శన లిచ్చారు.
                     ఒకసారి ఒక పౌరాణిక నాటకం లో దుర్యోధనుని పాత్రను చూడవలసి వచ్చింది. ఆ పాత్ర దారి చూపులు నేలపైన ,చేతులు క్రిందకు చూపించ సాగారు. ఆ నాటక ప్రదర్శనా నంతరం ఆ నటుడ్ని గ్రీన్ రూం లో కలసి,'బాబు ,దుర్యోధనుని మనస్తత్వం నా అంతటి వాడు లేదు అనుకునేది,అందువల్ల ఆ పాత్రను ధరించి ప్రదర్శించే టప్పుడు ,చూపు గాని,చేతి తో చూపించేటప్పుడు కాని క్రింది వైపు కు వుందా కూడదు. ' అని చెప్పారు. ఇలా పత్రాల యొక్క అంతరంగాన్ని తోటి నటులకు చెప్పి అభినయాన్ని సూచించే వారు.


స్త్రీ పురుష పాత్రలకు మని కిరీటం                                                         గుంటూరు కోమలా దేవి :


                     వర విక్రయం నాటకం లో ఘంటశాల వెంకటేశ్వర రావు భ్రమరాంబ గా ఆడ వేషం వేస్తే ,అందులో కాళింది గా నటనారంగేత్రం చేసిన గుంటూరు కోమలా దేవి. యాభై ఏళ్ల గుడి వాడ నాటక రంగానికి నిలువెత్తు సజీవముర్తి . నాటకాలు ఆడాలంటే గుడివాడ లో నే ఉండాలనే ఉద్దేశ్యం తో పంతొమ్మిది వందల యాభై లో గుడివాడ వచ్చి స్థిర నివాసం ఏర్పరచుకొని ,నేటి వరకు నాటక రంగంపై మక్కువతోనే, ఆ జ్ఞాపకాల తోనే జీవిస్తున్నారు. తన కుమార్తె పెళ్లి చేసిన తర్వాత,నాటకాల వాళ్ళంటే కుమార్తె బంధువు లలో వున్నా చిన్న చూపు తో ,ఎంతో ఇష్టమైన నాటక రంగాన్ని పంతొమ్మిది వందల ఎనభై లో త్యాగం చేసారు.
                    గుడివాడ కు చేరుకొన్న తొలి నాళ్లలో ప్రవాసం నాటకంలో వీరికి దేవరకొండ రామారావు అవకాశం కల్పిచారు.వీరితో పాటు దేవరకొండ రామారావు కూడా స్త్రీ పాత్రలు ధరించేవారు.'తెలుగు తల్లి' నాటకం లో భారతి వేషం వీరికి మంచి నటిగా పేరు తెచ్చి పెట్టింది. స్త్రీ ,పురుష పాత్రలు ధరించటం లో దిట్ట .కృష్ణుడు ,సత్యభామ ,చంద్రమతి ,సక్కుబాయి,వేషాలు వీరికి వెన్న తో పెట్టిన విద్య,'పల్లెపడుచు' లో రమాదేవి గా ,కైకాల సత్యన్నారాయణ  హిరో  చంద్రం గా అనేక సార్లు ప్రదర్శించారు. 
                   1954 లో గుంటూరు లో జరిగిన అఖిల ఆంద్ర 'రంగూన్ రౌడి ' నాటక పోటిలలో పాల్గొని అన్నపూర్ణ గా నటించి ఉత్తమ నటిగా బహుమతి పొందారు ,ఈ పోటీలకు న్యాయ నిర్ణేతలుగా జమ్మలమడక మాధవరాయ శర్మ ,మహాకవి జాషువా ,కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి ,వ్యవహరించారు. పువ్వుల అనసూయ సత్యభామ గా ,వీరు శ్రీ కృష్ణుడు గా ,రంగపుష్ప సత్యభామ గా ,వీరు శ్రీకృష్ణుడు గా అనేక ప్రదర్శన లిచ్చారు . అం దరూ ఆడవాళ్ళ తో రంగూన్ రౌడి ,సక్కుబాయి, రామాంజనేయ యుద్ధం ,తదితర నాటకాలు ప్రదర్శించి పేరు తెచ్చుకొన్నారు. ఖిల్జిరాజ్య పతనం ,చంద్ర గుప్త ,నారాజు నారాణి, మొదలైన చారిత్రిక నాటకాలలో అద్భుతమైన నటన ప్రదర్శించారు. 
               ఆంద్ర దేశ మంతటా వీరు నాటకాలు ప్రదర్శించే రోజులలో ఏకబిగిన నెల రోజుల పాటు వివిధ ప్రదేశాలలో నాటకాలు  వేస్తూ ,ఇల్లు చూడకుండా గడిపేవారు. ఇలాంటప్పుడు ఖైమా ఉండలు ,పిండి వంటలు చేసుకొని క్యానులలో పెట్టుకొని ప్రదర్శనలకు ప్రయాణించే దాననని చెప్పారు. సత్తెనపల్లి లో బుర్ర్రా సుబ్రహ్మణ్య  శాస్త్రి గారు సత్య భామగా ,వీరు శ్రీ కృష్ణుడు గా నాటకాన్ని ప్రదర్శించారు. వీరి భర్త శ్రీమన్నారాయణ  గారు ,నాటకాల కాంట్రాక్టర్ గా వుండేవారు. 
                గుడివాడ కళాకారుల సమాఖ్య కార్యదర్శి గా వున్నపుడు ,సినీ నటి జమున గారితో మాట్లాడి కళాకారుల కాలనీకి 53 స్థలాలను ఇప్పించిన ఘనత వీరికే దక్కుతుంది 
               ప్రముఖ నటులతో కొన్ని వందల నాటకాలు ప్రదర్శించి ,మేటి నటిగా గుర్తింపు పొందిన వీరు ,75 ఏళ్ళ వృద్ధాప్యం లో కూడా ప్రభుత్వం నుండి ఎ విధ మయిన కళాకారుల పెన్షన్ అందటం లేదని చెప్తుంటే హృదయం చలింఛి పోయింది.


అలనాటి మేటి నటుడు 
బొక్కా రాజేశ్వర వెంకట సత్యన్నారాయణ
  
         ఆంధ్ర నాటక రంగ చరిత్ర లో గుడివాడ నాటక రంగామికి ఎనలేని కీర్తి నార్జించి పెట్టిన అలనాటి మేటి నటుడు బొక్కా రాజేశ్వర వెంకట సత్యన్నారాయణ . అపర దుర్యోదనుడిగా ఖ్యాతి గడించారు. ఏడేళ్ళ ప్రాయం లో డాక్టర్ గా నటించిన నాటి నుండి రంగస్థలం మీద మక్కువ ఏర్పరచుకునారు .ఏడు దశాబ్దాలుగా పౌరాణిక ,సాంఘీక నాటకాలలో వందలాది పాత్రలు పోషించిన నటుడు. 
             సత్య హరిచ్చంద్ర లో విశ్వామిత్రుడు గా ,ఉద్యోగ విజయాలు లో దుర్యోధనుడుగా ,రేణుమహత్యం లో జమదగ్ని గా సేతాకల్యాణం లో రావణ బ్రహ్మ గా ,వెంకటేశ్వర మహత్యం లో బృగుడి గా ,కనక దుర్గమహత్యం లో వీరభద్రుడు గా ,రుద్రావతారం లో ప్రతి నాయకుడిగా ,రంగస్థలం మీద తనదయిన ప్రత్యెక ముద్ర వేశారు. 
             హరిచ్చంద్రుడి సత్యవ్రత నియమాన్ని పరీక్షించే విశ్వామిత్రుడు ,అతి కఠినం గా ఉండే నటనను ప్రదర్శించే టప్పుడు ప్రేక్షకులు విశ్వామిత్రుని నిందిస్తూ కర్రలు తీసుకుని రంగస్థలం పయికి వచ్చిన సందర్భాలు వున్నాయి. రంగస్థలంపై తానూ ప్రదర్శించే పాత్ర స్వభావాన్ని అర్థంచేసుకుని ,ఆ పాత్రని సజీవంగా రంగస్థలంపైకి తీసుకి వచ్చేవారు. గంభీరమైన కంట స్వరం తో ,భావా వేషంతో కూడిన పద్యాల్ని పాదతమ్లొనూ ,రసరమ్యంగా సందర్భోచితం గా పలికేవారు. వీరి నిండైన విగ్రహం ,వాచక ఆహార్యాలను ద్విగుణి కృతం చేసేవి. వేషాల వక్ష స్థలం ,నిండైన భుజాలు, విశాలమైన కళ్ళు ,ప్రత్యేక ఆకర్షణ గా ఉండేవి. తన పాత్రలకు తానె మేకప్ వేసుకునే వారు. 1944 లో దశిక వెంకటేశ్వర రావు వద్ద తబలా, డోలక్ నేర్చుకున్నారు . అనేక నాటకాలకే కాకహరికతలకు,ఖవ్వాలి లకు వాయిద్య సహకారం అందించారు. ఆ సమయంలోనే నటన ,విమర్శక చక్రవర్తి నందుల లక్ష్మి నారాయణ శాస్త్రి వద్ద హావ,భావ,నటనలను అభ్యసించారు. రావుల సుబ్బారావు వద్ద హార్మోనియం తో పటు ,పద్యాలు చదివే పద్దతి,పాటలు పాడే విధానం నేర్చుకున్నారు. రావణ బ్రహ్మ ,వాల్మికి మొదలైన ఏక పాత్రలు రచించి పోషించారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వీరి రావణ బ్రహ్మ  ఏకపాత్ర పలు సార్లు ప్రసారమైంది .భక్తి గీతాలు రాయటం లోను ,జ్యోతిష శాస్త్రం లోను ప్రవేశం ఉన్న వీరు,బి.వి.రంగారావు ,మల్లాది సూర్యనారాయణ ,జయరాజు,రేబాల రమణ,కాలపర్రు వెంకటేశ్వర్లు మొదలైన నటులతో నటించారు. కళా ప్రపూర్ణ ,నాటక ప్రవీణ బిరుదులతో సత్కరించ బడ్డారు. 

తుమ్మలపల్లి సాంబశివ రావు 


               నటుడు,కళా ప్రోత్సాహకుడు సాంబశివ డ్రామా డ్రస్ కంపెని అధినేత. 
           

పగటి వేషాలు - సామాజిక అంశాలు

            ఈ ప్రసంగాలు అక్టోబర్ 12 ,19 ,26  తేదిలలో విజయవాడ ,ఆకాశవాణి కేంద్రం నుండి ప్రసారం అయినాయి . వారి సౌజన్యం తో ..........




                  పగటి వేషాలు - సామాజిక అంశాలు




                 పగటి కలలు కనొద్దు అంటారు 
              పగటి వేషాలు వెయ్యొద్దు అని కూడా అంటారు 
              వేషం అంటే మారు రూపం 
              రావణాసురుడు మారు రూపం లో వచ్చి సీతను మాయం చేస్తాడు 

              పగటి వేషాలు చూసే కోణం లో వేషం వెనుక అసలు రూపం తెలుసు కోవాలి .అవి ఇప్పటికి అన్వయించు కోవచ్చు 
             ఈ వేషాల వెనుక ఆనాటి నేపధ్యం ఉంది . పురాణాలు,ఇతిహాసాలు ,మొదలైన వాటి లోనుంచి వచ్చిన వేషాలు ఆనాటి ,ఈనాటి,రేపటి,జిఇవితాన్ని మనకు చూపిస్తాయి .సామాజిక పరిస్థితులు.మనిషి లోపలి వేద్వంసం గురించి చెప్తాయి .ఒక పరమ ప్రయోజనం ఆశించి మనిషి లో ఆశను కలిగిస్తాయి. మంచి జిఇవనానికి దిక్సూచిగా ఉంటాయి. 
        
            ఇప్పుడు చెప్పుకో బోయే 34 పగటి వేషాలలో కొన్ని అంతరించి పోవచ్చు ,మరి కొన్ని అంతరించే దశలో ఉండొచ్చు ,మరి కొన్ని కొత్త రూపం లోకి మారే దశలొఉండొచ్చు. 
            కొన్ని పాత్రల అవసరం తీరి పోయింది .
            కొన్ని పాత్రలు ,చట్టాలు చేయడం వల్ల,సామాజిక మార్పుల వల్ల అదృశ్య మైనాయి .
            కొన్ని పాత్రలు ఆధునిక రూపాలలో మనం చూస్తూనే వున్నాం.
            ఈ నాటి రకరకాల పాత్రలాక్ ,వేషాలకు 'పగటి వేషాలే ' మూలం.
            ఇప్పుడు పగటి వేషాల వెనుక కథ ,అవి ప్రజలకు ఉపయోగపడిన తీరు,వాటిని ప్రభుత్వ పథకాలుగా మార్చిన వైనం తెలుసుకుందాం.ఈ కళాకారులు ప్రతి వేషాన్ని ప్రారంభించే విధానాన్ని తెలుసు కుందాం










                    బుడబుక్కల వేషం






.                
                      త్రేతా యుగం లో దశరథ మహా రాజు సంతానం కలగానందున బాధ తో కుమిలి పోతున్నాడు . ఆ బాధ నుండి అతనికి విముక్తి కలగా చేసి రఘు వంశాన్ని అభివృద్ధి చేయాలనేది శ్రీ మహా విష్ణువు సంకల్పం . అందుకోసం దశరధుని పుత్రకామేష్టి యాగాన్ని చేయమని చెప్పటానికి బుడబుక్కల వేషం ధరిస్తాడు శ్రీ మహా విష్ణువు. అలా ఈ వేషం లో దశరధుని దగ్గరకు వచ్చి యాగం చేయమని ప్రేరేపించటం ఈ వేషం నేపధ్యం.


                 వ్యవ సాయం లో పంట దిగుబడి తగ్గి బాధ పడే రైతులు ,అనేక సమస్యలతో నిరాశ చెంది జిఇవితం పై విరక్తి చెందు తున్నారు .


                ఆర్థికంగా ,శారీరకంగా,మానసికంగా, బాధలలో ఉన్న వారందరిని నిరాశకు లోను కావద్దు, భవిష్యత్తు లో బాగుంటుందని చిగురించే ఆశలు కలిగిస్తున్నారు ఈ వేషం ద్వారా . ప్రస్తుతం బాధల నుండి విముక్తి పొందటానికి చేయవలసిన పనుల గురించి ఆలోచించి,ఆచరణలో పెట్టటమే తక్షణ మార్గం , పరిష్కారమని ప్రజలకు చెప్తారు.


               విజయం సాధించాలంటే అసంతృప్తి ,అసహనం,మానసిక ఒత్తిడి తగ్గించుకోవాలి .సమాజంలో అన్ని వర్గాల తో సత్సంబందాలు నెలకొల్పు కోవటం ద్వారా ,సానుకూల దృక్పధాన్ని అలవరచి కోవాలి. పరిపరి విధాల పోయే మనసు ను సానుకూల దృక్పధం వైపుకు మరల్చమని చెప్పేదే ఈ వేషం . ప్రజలకు భవిష్యత్ మీద నమ్మకం కలిగించే  మాటలు చెప్పటానికి మానసిక వైద్యులు ,సానుకూల ఆలోచన తరగతులు నిర్వహించే వారు కృషి చేస్తున్నారు.






               వేషం చెప్పే విధానం:




             ఏయ్ ,నిలునిలు చండాలి ,అయిరే అంబా పల్కు జగదంబా పల్కు,ఆయీ పల్కు,ఆయితాయీ పల్కు, సద్గునాంబ పల్కు స్య్కాట్ శ్రోణి పల్కు యక్షిని పల్కు అంబర పక్షి పల్కు,ఆకాశవాణి పల్కు,కంచిలోని కామాక్శీ పల్కు,కాలికింద భూదెవి పల్కు ,కాశీలోని విశాలాక్శీ పల్కు మధురలోని మీనాక్షి పల్కు,బెజవాడ కనక దుర్గ పల్కు ..........






                                ************          ************        







               భట్రాజుల వేషం








                    రాజాస్థానాలలో భట్రాజులు వుండేవారు. రాజుని అనుక్షణం పోగాడటమే వీరి పని,వుద్యోగం. రాజుని కీర్తిమ్చడమే కాక ,రాజ సభకు వచ్చిన వారిని సైతం పొగుదుతూ రాజుకు సంతోషం కలిగించేవారు. యుద్దాల సమయం లో సైన్యాలను ,రాజు గారి ధీర గుణాలను కేర్థిస్థూ ,మానసికంగా యుద్దానికి సమాయత్తులను చేస్తారు.


                   మనిషి లో వున్నా సర్వ శక్థులనూ బహిర్గ్హత పరచి  ,ఆ దిశగా ఆలోచించి ,ఆచరణ లోకి దిగటానికి సహాయ పడుతుంది ఈ వేషం. ధైర్య సాహసాలను ,ఆలూచనను మేల్కొలిపి జీవనసమరానికి సిద్ధం చేయటం ఈ వేషం ప్రత్యేకత .మంచి భావాలను కలిగించటం ,ధైర్యాన్ని కలిగించటం ,దీవించటం చేస్తారు భట్రాజులు .


                మనకు తెలియని మన శక్తిని హిప్నాటిజం దేఅర్రా ప్రదర్శింప చేస్తున్నారు. ఈ వేషం ద్వారా జరిగే ప్రయోజనాన్ని నేడు మానసిక వైద్యులు కలిగిస్తున్నారు. ఆధునిక సమాజంలో హిప్నాటిస్టు లే భట్రాజులు.


                   వేషం చెప్పే విధానం :

             ధర సింహాసానమైన భంబు గొడుగై,తద్దేవతల బృత్యులై ,బ్రహ్మాండ మాకారమై,షిరి భార్యామణి ఐ ,విరంచి కోడుకై ,శ్రీ గంగ సత్పుత్రి అయి ,వరుసాన్నీఘన,రాజసంబు నిజమై ,వర్థిల్లు నారాయణా!
            చంద్రా, కందర్ప,నలకుబరా,పురూర్వకాంతు,వసంతు,జయంతాదుల కన్నను అపూర్వకరంబైన ,మీ చక్కదన మున్నూ ,పద్మ మహా పద్మ ,శంకమాచక్ర,నీలా,అమనీలా,ధనుస్కు,దానవా దానంబుల కన్నా అద్భుతమైన మీ సంపద లున్నూ................

************             ************ 


             చాతాది వైష్ణవుల వేషం



                 
                క్రీస్తు పూర్వమ్ 2060 సం. ల   క్రితం శ్రీ శంకరా చార్యుల వారు జన్మించి నపుడు ,ప్రపంచమంతా శివమతం ఉండేదని చెపుతారు.తరువాత క్రీస్తు శకం 972 వ  సం.లో   శ్రీ రామానుజాచార్యులు ఉద్భవించారని చెబుతారు .ఈ మతాచారాలను బట్టి ,ఆరు మతాలుగా విభజించారని అందులో వైష్ణవ మతం గురించి చెప్పారు. అలాగే మానవ జీవితమ్ గురించి ,వేదాంత విషయాలను భోధించే నేపధ్యం ఈ వేషం. 

              భక్తీ  పాటలు పాడుతూ ప్రజలక భక్తీ ని వివరిస్తూ ,వారిని సన్మార్గంలో నడిపిస్తూ,విజ్ఞాన వినోదాలను అందించే కళారూపం ఇది.భక్తీ,జ్ఞాన ,వైరాగ్య కీర్తనలు ,పోతులూరి వీర బ్రహ్మం గారి తత్వాలు చక్కగా పాడుతూ భక్తీ ని ప్రభోదిస్తారు . మంచి విషయాలను ఆకళింపు చేసుకొని క్రమ మార్గం లో జివిం చ టానికి ప్రజలు ప్రయత్నిచే వారు.ఇహపరమైన అన్ని విషయాలను తెలుసుకొని,అశాశ్విత మైన విషయాల పట్ల అప్రమత్తంగా ఉంటూ,బ్రతికి నంత కాలం హాయిగా,ఆనందం గా ఉంది ,చుట్టూ ఉనా సమాజాని కూడా అలాగే ఉంచాలని చ్ప్పే కళారూపం ఇది. 


           చావు లాంటి విషయాలను జయించాలంటే భక్తీ మార్గమే ఉపశమనం . నేడు పెచ్చ్లరిల్లు తున్న అరాచకాలను అణచటానికి కూడా భక్తీ మార్గం ఒక సాధనం. ప్రభుత్వం వారు దేవాదాయ ధర్మదాయ శాఖ ద్వారాఅనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తునారు.




                       వేషం చెప్పే విధానం :



జగతిలో  మనవ జన్మమే దొరకదు 
దొరికిన పురుషుడి పుట్టుటరదు
పురుషుడి పుట్టిన పొలతి మంచిది రాదు 
వచ్చిన భాగ్యంబు హెచ్చు తరదు 
భాగ్యశాలికి పుత్ర ఫలము చేకూరదు 
కూడిన వితరణ జాలుట రదు 
వితరణ కల్గిన విహిత శాంతము సున్న
శాంతము కల్గిన సత్య మరదు
సత్య మదవిన  శ్రీ హరి స్మరణ కలదు 
హరిణి భజియించి న వాడె పరమ యోగి

************            ************


             
                  
(ఇలా వీలు వెంబడి ఈ వ్యాసాన్ని ప్రచురిస్తాను ,దయచేసి చూసి మీ అభిప్ర్రాయాన్నితెలియ చేయండి  )

జాతీయ ,ప్రపంచ తెలుగు మహా సభల చాయా చిత్రములు

           అఖిల భారత జాతీయ తెలుగు రచయితల , ప్రపంచ తెలుగు రచయితల మహా సభల నిర్వహణ లోను మరియు అనేక జాతీయ సదస్సుల లోను ముఖ్య కార్య కర్తగా సేవలను అందించాను . ఆ సందర్భా లలో కొన్ని చాయా చిత్రములను తీయుట జరిగినది .అందులో కొన్ని దిగువ ఇస్తున్నాను . తిలకించండి .మీ అభిప్రాయములు తెలియ పరచండి.
  



2006 అక్టోబర్ 27 -28 తేదిలలో విజయవాడ ఎస్.వి.ఎస్.కళ్యాణ మండపంలో జాతీయ తెలుగు రచయితల మహా సభలు జరిగాయి


సిలికాన్ ఆంధ్ర వ్యవస్థాపకులు కుచిభోట్ల ఆనంద్ ను సత్కరిస్తున్న తాతా రమేశ్ బాబు,శ్రీ వేటూరి సుందరరామ మూర్తి ,మండలి బుద్దప్రసాద్,డా.రాళ్ళబండి కవితా ప్రసాద్,వంగపల్లి విశ్వనాథం 




                                                                                                                                                                                                                                              
 
జాతీయ తెలుగు రచయితల మహాసభల సావనీర్ ను ఆవిష్కరిస్తున్న (ఎడమ నుండి ) తాతా రమేశ్ బాబు,శ్రీ వంగపల్లి విశ్వనాధం,డా.రాళ్ళబండి కవితాప్రసాద్,శ్రీ మండలి బుద్ద ప్ప్రసాద్ ,శ్రీ వేటూరి సుందర రామ మూర్తి ,శ్రీ కూచిబోట్ల ఆనంద్ 






సి.ధర్మారావు గారిని సత్కరిస్తున్న తాతా రమేశ్ బాబు,సుధామ ,ఇంకా చిత్రంలో గుత్తికొండ మరియు నరహరిసేట్టి నరసింహారావు 







జాతీయ తెలుగు రచయితల మహా సభల మొదటి రోజు తాతా రమేశ్ బాబు 'అత్యాధునిక పద చిత్ర కళా ప్రదర్శన ను ప్రారంభిస్తున్న ఆచార్య కొలకలూరి ఇనాక్ ,మండలి బుద్ద ప్రసాద్ 







 

పద చిత్ర కళా ప్రదర్శన లో మరొక దృశ్యం 








అత్యాధునిక పద చిత్ర కళా ప్రదర్శన ను తిలకిస్తున్న కవి జ్వాలాముఖి ,శ్రీ ఇనాక్ 


2007  సెప్టెంబర్ 21 ,22 ,23  తేదిలలో  శ్రీ శేషసాయి కళ్యాణ వేదిక ,విజయవాడ లో 
'ప్రపంచ తెలుగు రచయితల మహా సభలు' 
జరిగాయి 
ఈ సభల లోని కొన్ని ఛాయాచిత్రములు 



ప్ర్రారంభానికి ముందు 









ప్రారంభానికి సన్నాహం







ప్రారంభానికి ముందు



 ఎడమ నుంచి శ్రీ దగ్గుబాటి వెంకటేశ్వర రావు ,జస్టీస్ జాస్తి చలమేశ్వర్,డా.గూటాల కృష్ణమూర్తి , శ్రీ మండలి బుద్ద ప్రసాద్
వెనుక వరుస :ఎస్.కే.డీ.ప్రసాద రావు ,తాతా రమేశ్ బాబు ,కే.జితేంద్ర బాబు





 కూర్చున్న వారు డా. ఆవుల మంజులత,పద్మశ్రీ యార్లగడ్డ లక్ష్మి ప్రసాద్,శ్రీ దగ్గుబాటి వెంకటేశ్వరరావు
నిలుచున్నా వారు ఎస్.కే.డి. ప్రసాద రావు,తాతా రమేశ్ బాబు,డా. జి.వి.పూర్ణచంద్,





 సినీ జానపద కవి శ్రీ జాలాడిని సత్కరిస్తున్న తాతా రమేశ్ బాబు






 సినీ కవి జాలాది నమస్కారాలు





 సభ జరుగు తున్నపుడు  వెనుక కుర్చుని నిర్వహణ చర్చలు







 సభానంతరం బయట పనులు







 సభ లో  పద్మశ్రీ యార్లగడ్డ ను సత్కరిస్త్న్న శ్రీ గుత్తికొండ  వెనుక తాతా రమేశ్ బాబు
















సభలు దిగ్విజయం గా నిర్వహించినందుకు తాతా రమేశ్ బాబు ను సత్కరిస్తున్న మంత్రి  శ్రీ ధర్మాన ప్రసాదరావు , పద్మశ్రీ యార్లగడ్డ లక్ష్మి ప్రసాద్,మంత్రి శ్రీ మండలి బుద్ద ప్రసాద్, శ్రీ గుత్తికొండ ,శ్రీ జివి 







                                                       
సభలు దిగ్విజయం గా నిర్వహించినందుకు తాతా రమేశ్ బాబు ను సత్కరిస్తున్న మంత్రి  శ్రీ ధర్మాన ప్రసాదరావు , పద్మశ్రీ యార్లగడ్డ లక్ష్మి ప్రసాద్,మంత్రి శ్రీ మండలి బుద్ద ప్రసాద్, శ్రీ గుత్తికొండ ,శ్రీ జివి 







                                                                       






                                                   






                                                                        
ప్రపంచ తెలుగు రచయితల  సభల  ముగింపు సభకు స్వాగతం పలుకుతున్న తాతా రమేశ్ బాబు






                                                             
ప్రపంచ తెలుగు రచయితల  సభల  ముగింపు సభకు స్వాగతం పలుకుతున్న తాతా రమేశ్ బాబు







                                                                    
సభ బయట నిర్వహణలో





                                                                      
సభ బయట నిర్వహణలో




                                                              
సభ బయట నిర్వహణలో




                                            
సభ బయట నిర్వహణలో




     సభ బయట నిర్వహణలో