My Blog List

Saturday, July 7, 2012

కళా 'గురు పూజోత్సవం''

కళా 'గురు పూజోత్సవం''
గుడివాడ సమీప గ్రామం 'బిళ్ల పాడు ' గ్రామం లో  రంగస్థల కళా కారుల కాలని వుంది . అక్కడ 2001 జనవరి 24 న  కళా కారులచే ' శ్రీ షిర్డీ సాయిబాబా దివ్యమందిరం ' నిర్మించబడినది.. అప్పటి నుండి ప్రతి సం.. 'గురు పౌర్ణమి ' ఉత్సవాలు  క్రమం తప్పకుండ జరుపుతున్నారు..
ఉత్సవాలలో శ్రీ సాయి నాధుని దివ్య పాలరాతి విగ్రహానికి క్షీరాభిషేకం, విశేష పూజ ,భజనా కార్యక్రమాలు ,ప్రసాద వినియోగం, మధ్యాహ్నం అన్నసమారాదన , భక్తి రంజని సంస్కృతిక కార్యక్రమాలు  జరుగుతాయి.. అంతే కాక  'గురువులను పూజించు కోవటం ' ఆనవాయితీగా వుంటుంది..








ఈ సారి 'కళా గురువు'' గా నన్ను సత్కరించారు..
ఈ సందర్భంగా నేను మాట్లాడుతూ ,' గురువులు సమస్త మానవావాళి కి మార్గదర్శకంగ వుంటూ, ప్రపంచానికి మంచి ని అందిస్తారని , తద్వారా  సమ సమాజం నిర్మాణ మవుతుందని , ఇదే మార్గాన్ని షిర్డీ సాయిబాబా అనుసరించారని ' చెప్పాను .
'కళా భారతి ' జానపద కళా కారుల సంక్షేమ సంఘం అధ్యక్షులు మిరియాల శేఖర్ బాబు మాట్లాడుతూ, ' బహుముఖ ప్రజ్ఞా శాలి , రేడియో టివి నటుడు,జానపద కళా కారుడు,మా సంఘం 'గౌరవ అధ్యక్షులు ' , మీదు మిక్కిలి రాష్ట్ర ప్రభుత్వ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత అయిన తాతా రమేష్ బాబు ను సత్కరించు  కోవటం మా అద్రుష్టం గా భావిస్తున్నామని ' చెప్పారు..
ప్రముఖ జాతీయ జానపద కళా కారులు, దేవర పెట్టె ఫేం యడవల్లి రమణారావు మాట్లాడుతూ,' ఎక్కడో మూలన  వున్న  మా కళా కారుల గురించి ఒక పుస్తకం రాస్తూ, తానూ కళా కారుడై వుండి కూడా మా అభ్యున్నతికి పాటు పడుతున్న తాతా రమేష్ బాబు గారికి ప్రతి కళా కారుడు  రుణపడి వుండాలన్నారు.
ఇంకా మాజీ వర్డు సభ్యులు పువ్వుల శోభారాణి,, మిరియాల శ్రీనివాసరావు,యడవల్లి వెంకటేశ్వర రావు , పలువురు కళా కారులు పాల్గొన్న ఈ సభ అర్థవంతంగా జరిగింది..

1 comment: