My Blog List

Saturday, June 25, 2011

" గుడివాడ వైభవం " పుస్తక ఆవిష్కరణ విశేషాలు

"గత కాలపు అనుభవాలు,జ్ఞాపకాలు,సంఘటనల సమాహారమే చరిత్ర " అని ఆంధ్ర ప్రదేశ్ హిందీ అకాడెమీ చైర్మన్ పద్మశ్రీ యార్లగడ్డ లక్ష్మి ప్రసాద్ అన్నారు. ఈ నెల ఇరవైన సోమవారం గుడివాడ క్లబ్ ఆవరణ లో , విద్యా,కళారంగ పోషకులు కాజ వెంకట్రామయ్య ద్వారం లోపల ,నవయుగ వైతాళికుడు కవిరాజు త్రిపురనేని రామస్వామి కళా వేదిక పై తాతా రమేశ్ బాబు రచించిన "గుడివాడ వైభవం" పుస్స్తకాన్ని ఆవిష్కరిస్తూ పై విధంగా స్పందించారు. అనంతరం మాట్లాడుతూ,పుస్తక ఆవిష్కర్త తానై నందున తాను మాత్రమే ఆవిష్కరిం చానని ,వేదిక పైనున్న అందరికి పుస్తకాలు ఇచ్చి చూపిస్తే అది సాముహిక ఆవిష్కరణ అవుతుందని ,సినిమా వాళ్ళు కాసేట్ రిలీజ్ చేస్తూ అందరి చేతుల్లో ఉంచే చెడ్డ సంప్రదాయాన్ని అనుసరిస్తున్నారని అన్నారు. జ్ఞానపీట్ అవార్డ్ గ్రహీత ద.సి.నారాయణ రెడ్డి గారి అంక్ష ఏమిటంటే గ్రంధావిష్కరణ ఎవరూ చేస్తే వారు మాత్రమే ఆవిష్కరించాలని .....పురోహితుడు మంత్రాలు చదువు తుంటే పెళ్లి కుమారుడు మాత్రమే తలి కట్టాలని,మిగిలిన పేదలు అక్షతలు వేయలే గానీ తాళి పట్టుకో కూడదని చమత్కరించారు.


కొన్ని థ్రిల్లింగ్ విషయాలు చెపుతా నంటూ .." యాభై సంవత్సరాల క్రితం ౧౯౬౧ లో అక్కినేని నాగేశ్వర రావు మొదటి సరిగా అమెరిక వెళ్లి వచ్చిన తరువాత గుడివాడ కాలేజి కి వచ్చారు. అప్పుడు నాకు ఎనిమిది సంవత్సరాలు ,మా పిల్ల జట్టంతా ఆయన్ని చూడాలని వెళ్ళాం. ఆ జనం లో ఊపిరి ఆడక నలిగి పొయినా ఆయన్ని చుసిన సంతోషం తో ఇంటికి వేళ్ళను. అలాంటి అక్కినేని నాగేశ్వర రావు గారితో ,కొన్ని సంవత్సరాల అనంతరం ఒకే చోట కలిసి భోజనం చేయటం,కబుర్లు చెప్పుకోవటం ఒక థ్రిల్లింగ్. అలాగే ౧౯౭౧ లో నందమూరి తారక రామారావు ,ఇక్కడి బాలజు థియేటర్ ను ప్రారంభించటానికి వచ్చారు. గుడివాడ మునిసిపల్ ఆఫీసు లో వారికి పౌర సన్మానం చేసారు. అప్పుడు పద్దెనిమిది సంవత్సరాల వయసు నాది . ఆఫీసు వెనుక నున్న పైపు పట్టుకుని వెలది పాకుతూ రామారావు,సావిత్రి లను చూసాను. అప్పుడు కాతరి సత్యన్నారాయణ మునిసిపల చైర్మన్. అలా ఆ సభలో పాల్గొని జీవితం ధన్యమై పోయిందని భావించిన మహత్తర సన్నివేశం అది. అదే ఎన్టిఆర్ తో నాలుగున్నర సంవత్సర పాటు ఉదయం ఐదు గంటల నుండి సాయంత్రం తొమ్మిది గంటల వారకు తిరగటం ,తాకటం,ఎంత ఉద్వేగా భరితంగా ఉంటుందో ఊహించండి.


మీలో ఎవరన్న సినీ నటులు నాగార్జున ,బాలకృష్ణ -అలా చేయి ఊపుతూ వెళ్ళిన తరువాత ఓ పడి సంవత్సరాల తరవాత మీ ఇంటికి వారు,వారింటికి మీటు వేల్లెమ్త చనువు ఏర్పడితే ఎంత థ్రిల్లింగ్ గా వుంటుంది.


అనుభవాలే చరిత్ర . మేధామేతిక్స్ లో వృత్తం అంతం . మధ్యబిందువు గుడివాడ గా మనం అనుకుంటే ,అక్కడ నుండి చుస్తే గత శతాబ్దాల ఆంధ్ర దేశాన్ని ప్రభావితం చేసిన విశిష్ట వ్యక్తులంతా ఈ యభై కిలోమీటర్ల రెడియాస్ పరిధి లో పుట్టరనేది ఒక చారిత్రక సత్యం. మీరు ఏ రంగం అయినా తీసుకొంది ,సిని చరిత్రలో గూడవల్లి రామబ్రహ్మం,నందమూరి తారక రామారావు,అక్కినేని నాగేశ్వర రావు ,దుక్కిపాటి మధుసూధనా రావు ,ఘంటసాల వెంకటేశ్వర రావు -పత్రిక రంగంలో కసినధుని నాగేశ్వర రావు ,ముట్నూరి కృష్ణారావు ,నార్ల వెంకటేశ్వరరావు ,రామోజీ రావు ఆ రంగాన్ని ప్రభావితం చేసిన విశిస్త వ్యక్తులు . సాహిత్య రంగం తీసుకుంటే , కవిరాజు త్రిపురనేని రామస్వామి గొప్ప సంఘ సంస్కర్త . భారత దేశంలో ఆధునిక కాలంలో సమాజ ఉద్దరణకు కంకణం కట్టుకున్న తోలి వ్యక్తి . ఈ రోజున మద్రాసు లో వున్నా ది ఎం కే ,ది కే ,ఏ ది ఎం కే , రాజకీయ పార్టీలకు మూల కారణం రామస్వామి నాయకర్ . అలాంటి రామస్వామి నాయకర్ కు కూడా ప్రేరణ మన కవిరాజు రామస్వామి. అటువంటి వాడు పుట్టింది మన గుడివాడలో . "బ్రహ్మపురం మనదేరా -పర్లాకిమిడి మనదేరా- కాదని వాడుకు వస్తే కటకం కూడా మనదేరా అన్నాడు కవిరాజు. బ్రహ్మపురం అంటే బెర్హంపూర్ . ఒరిస్సా దగ్గర బెర్హంపూర్ లో వివి గిరి గారు పుట్టారు. "బెంగుళూరు మనదేరా -బళ్ళారి మనదేరా- కాదని వాడుకు వస్తే కన్నడ మొత్తం మనదేరా అన్నాడు. బెంగుళూరు మనదే అక్కడ గాలి జనార్ధన రెడ్డి, నాయుడు, మొదలైన మనవాళ్ళు అక్కడ సగం మంది వున్నారు. "చెన్న పట్నం మనదే-చెంగల్పట్టు మనదే- కాదని వాడుకు వస్తే తంజావూరు మనదే "అన్నాడు. చేన్నపత్నాల్ అంటే మద్రాసు గా మరి చెన్నై అయిమ్దిప్పుడు. తంజావూరు సరస్వతి మహల్లో ఇప్పటికి వున్నా తెలుగు తాల పాత్రగ్రంధాలూ తెచ్చుకోలేక పోతున్నాం .


ఇంకా " వీర గంధము తెచ్చినారము -వీరుడెవ్వడో తెల్పుడీ


పూసిపోదుము ,మెడను వైతుము -పూలదండలు భక్తితో "-అని అద్భతమైన స్వాతంత్రోద్యమ గీతాన్ని రాస్తే, , ఆచార్య ఎన్ జి రంగ , బెజవాడ గోపాలరెడ్డి గార్లు ,ఆ గీతాన్ని ఆలపిస్తూ ఉప్పు సత్యాగ్రహం లో పాల్గొని జిల్లాకు వెళ్ళారని, అంత స్పూర్తిని రగిలించిన గీతాన్ని రాసిన కవిరాజు ఇక్కడ జన్మిచాడని కొనియాడారు.


ఉ. ఇమ్ముగ కకులమ్ము మోడ్లీ వారకుం గల యాంధ్ర పూర్వ రా


జ్యంముల పేరు చెప్పినా హ్రుడంతారమే లో చాలించి పోవు నా


ర్త్రమగు చిట్టా వృత్తుల పురాభవ నిర్ణయమేనని , నేనని జ


న్మమ్ములు గాక నీ తనువున్ బ్రవహించు నో నందర రక్తముల్ "


- అని చెప్పినా కవిసామ్రాట్ విశ్వనాధ సత్యన్నారాయణ ఇక్కడకు ఇరవై కిలోమీటర్ల దూరంలో వున్నా మన నందమూరు లో జన్మిచారు. . ఇంతమంది విఘ్నులు ,కవులు, కళా కారులు - ఒక శతాబ్దాన్ని ప్రభావితం చేసిన మహనీయులు జన్మించిన నెల ఇది. ఈ నెల ఇంత గొప్పదని తాతా తల్లిదండ్రు లింత గొప్పవారని తెలియ చేసే భాద్యత అందరిమీద ఉంది. అటువంటి మహత్తరమైన భాద్యతను చేపట్టాడు మన తాతా రమేశ్ బాబు . అభినందనలు.


వైతాళికులు కవిత సంపుటి ముద్దుకృష్ణ కనక ఈయక పొతే ఎంతోమందిని మరచిపోయే వారము . " -అంటూ తనదయిన శైలిలో ఆకట్టుకొనే ప్రసంగం చేసి ,మన సంస్కృతి ,సంప్రదాయాలు ను పుస్తకాలు ,కలలే కాపాడుతున్న విషయాన్ని తేల్చి చెప్పారు. " గుడివాడ చరిత్ర " ను భావి విద్యార్థులకు తెలియ చేయటానికి ప్రతి ఏట పట్టాన చరిత్ర ,ప్రముఖుల జీవిత విశేషాలపై వ్యాస రచన, చిత్రలేఖన పోటీలను నిర్వహించాలని సూచించారు.


సభకు అధ్యక్షత వహించిన ఎర్నేని వెంకటేశ్వర రావు మాట్లాడుతూ, త్రేతాయుగం లో శ్రీరాముడు లంక పై దండెత్తి రావణాసురిని అంతమొందించి విభీశానుడికి పట్టాభిషేకం చేసినపుడు ,స్వర్ణ మాయమయిన లంక లోనే ఉంది పరిపాలించ వలసినదిగా కోరితే , "ఆపి స్వర్ణ మయి లంక నేమ్ లక్ష్మణ రోచతే " అంటూ - " జననీ జన్మ భూమిశ్చ స్వర్గాదపి గరియసి " అంటూ పుట్టిన వూరు ,కన్నా తల్లి స్వర్గం కంటే గొప్పవని ,తాను అయోధ్య కే తిరిగి వెళ్తానని అనడాని చెప్తూ, మనమంతా ఏదో ఒక ప్రాంతంలో పుడతం, ఎన్నో అనుభవాలు ,అనుభూతులు వుంటై. ఆయా ప్రదేశాల గురించి మన తాతలు ,పెద్ద వాళ్ళు చెప్పేవారు. ఈ చెరువు ఫలానా వారిది ,ఇప్పుడీ స్టేడియం కట్టారని, ఈ చెట్టు, పుట్టల చరిత్ర ఇది అంటూ వాటి వెనకాల కథలు చెప్పేవారు. మేము పెరిగి పెద్ద వాళ్ళం అయినపుడు, మాకవి చెట్టులు, పుట్టలు .చెరువులు గా కనపడేవి కావు. ఆత్మీయ బంధువులు గా ,మా జిఇవితంలో భాగంగా తోచేవి. ఇవాళ కాలం మారింది . పిల్లల్ని కిండార్ గార్డెన్ లో వేసిన దగ్గర నుండి ఇంఫర్మేసన్ తెచ్నోలజి లో గొప్పవాడు కావాలనో ,డాక్టర్,ఇంజనీర్ అవ్వాలని ఆశలు పెట్టుకొంటూ -ఆడుకోవటానికి ,స్నేహంగా ఉండటానికి అవకాసం లేకుండా చేస్తున్నారు. ఎప్పుడూ పాటలు రుబ్బుతూ ప్లే గ్రౌండ్ అంటే ఎలా వుంటుంది,ఎక్క ద వుంటుంది అనుకొనే దుర్కద్రుశ్త వాతావరణం లో పిల్లల్ని పెంచుతున్నారు. ఇలాంటి సందర్భం లో గుడివాడ చరిత్ర-భాష-సాహిత్య-కళారంగా ప్రముఖుల విశేషాలతో పుస్తక రూపంలో అందించిన తాతా రమేశ్ బాబు అభినందనీయులు అన్నారు. గుడివాడ ప్రసస్త్యాన్ని తెలియ చేసిన బృహత్తర గ్రంధం తీసుకు రావాలని, అధ్యయన సదస్సును నిర్వహించ బోతూ వేసిన తోలి గుడివాడ వైభవం గా అభివర్ణించారు.


గ్రంధ రచయిత తాతా రమేశ్ బాబు మాట్లాడుతూ, గుడివాడ ప్రాంత విద్యార్థుల పాఠ్య పుస్తకాలలో గుడివాడ చరిత్రను ప్రత్యేక పత్యంసం గా చేసి ప్రభుత్వ పరీక్షలలో మూడు మార్కుల ప్రశ్నగా తప్పనిసరి చేయ గలిగినప్పుడే చరిత్రను తెలుసికోవటానికి ఆసక్తి చూపుతారని , ఇందుకు మేధావులు , విద్యా రంగ నిపుణులు,ప్రజాప్రతినిధులు కృషి చేయాలన్నారు. అలాగే ఎక్కడి కక్కడ స్థానిక చరిత్రలు పత్యంశం వుండాలని సూచించారు. తాను గుడివాడ వైభవాన్ని రేఖామాత్రం గానే రాసానని చెప్పారు.


తొలుత ఏ ఎన్ అర కళాశాల విసు ప్రిసిపాల్ స్వాగతం పలుకగా ,ప్రముఖ పగటి వేష కళాకారుడు మిరియ లా శేఖర బాబు బృందం ఆలపించిన దేశభక్తి ,జానపద గేయాలు ప్రక్ష్కులను అలా రిమ్చాయి. ఈ సభలో ఏ ఎన్ అర కాలేజి కర్స్పందేంట్ పర్వతనేని నాగేశ్వర రావు, కోశాధికారి కాట్రగడ్డ సింహాద్రి అప్పారావు, బిఇడి ప్రిన్స్పాల్ ఎన్ అరుణ కుమారి, వికేఅర్ &విఎంబి పాలి టెక్నిక్ కళాశాల కరస్పన్ దేంట్ కురుమద్దాల సుధాకర్, అమ్మ చారిటబుల్ ట్రస్ట్ మాటూరి రంగనాద్,పులవర్తి కోర్నేలియస్, పిన్నమనేని భూపతి రాయుడు, సజ్జ శివరామ క్రిశ్నైహ్ ,రక్త కన్నీరు ఫేం దాసరి పూర్ణ మొదలయిన వారు పాల్గొనగా పెద్ద సమాఖ్య లో విద్యార్థులు, సాహితీ వేత్తలతో సభ ప్రాంగణం కిక్కిరిసి పోయింది .


మన సంస్కృతి సంప్రదాయాలను పుస్తకాలు, కళలు కాపాడు తయనే నమ్మకాన్ని కలుగ చేసింది ఈసభ.

1 comment:

  1. " గుడివాడ వైభవం " పుస్తక ఆవిష్కరణ విశేషాలు కళ్లకు కట్టినట్లుగా తెలియపరచినందులకు ప్రమోదం. తొలుత ఛాయాచిత్రంలో ఒకరి చేతిలోనే పుస్తకం చూసి వైరుధ్యాన్ని గమనించాను. అందుకు కారణం మీ నివేదికలో తెలిసింది. గుడివాడ విశేషాలు మీ పుస్తకంలో ఆవిష్కృతమయ్యాయని ఆశిస్తాను. ఈ నివేదికలో కొన్ని ముద్రారాక్షసాలున్నాయి. ఉదాహరణకు పత్యంసం, పత్యంశం (పాఠ్యాంశం), ప్రిసిపాల్ (ప్రిన్సిపాల్), ప్రక్ష్కులను అలా రిమ్చాయి (ప్రేక్షకులను అలరించాయి), కర్స్పందేంట్ (కరస్పాండెంట్) వగైరా. సవరించకోరుతాను. ఉపయుక్త పుస్తకాన్ని వెలువరించినందులకు అభినందనలు.

    ReplyDelete