My Blog List

Sunday, August 15, 2010

త్రిపురనేని శ్రీనివాస్ జ్ఞాపకాలు

మనిషి ని తోటి మనిషి దోచుకొనే దోపిడీ వ్యవస్థను మా తరం తోనే అంత మొందించాలనే ఆకాంక్ష తో ,సామాజిక చైతన్యానికి సహకారిగా, "జనప్రభ " సాహిత్య మాస పత్రికను పంతొమ్మిది వందల ఎనభై ఐదు ,జనవరి నెలలో ప్రారంభించాం . "జనప్రభ" సంపాదకుడు గా నేను ,అనగా తాతా రమేశ్ బాబు ను వున్నాను .


" త్రిపురనేని శ్రీనివాస్" అనే యువకుడు ,తన కవితలు ,కథలు ప్రచురించి ,ప్రోత్సహించమని ,నాకు ఉత్తరాలు రాసేవాడు. రచనా స్థాయి ప్రాధమిక దశలొ కాబట్టి ,"మార్పులు చేర్పులు చేయాల్సిన అవసర ముంటే చేయ "మనే ఉత్తరాన్ని ,అయన దగ్గర నుండి తీసుకుని ,విషయం చెడ కుండా సంస్కరించి ప్రచురించాను. ప్రారంభించిన ౩ వ నెలలో "కార్మిక వృక్షాలు " అనే వచన కవితను,మే నెల సంచికలో "కాగితం పులి "["చిత్తూర్ జిల్లా లోని ఒక పల్లెలో వాస్తవం గా జరిగిన కథకు అయన శక్తి మేరకు ,కల్పితాల వ్యక్తుల పేర్లతో పంపిన కథ ను నాలుగు సార్లు తిరగ రాసి ] అనే కథను ప్రచురించాను


కాగా ,అదే సం. నవంబరు ఇరవై మూడవ తేదిన ఒక వుత్తరం రాసాడు .క్రింద చూడండి....


తా.ర.గారికి [తాతా రమేశ్ లో మొదటి అక్షరాల]


నేను అరెస్ట్ అయి జైల్లో వున్నపుడు మీరు మా ఇంటికి వచ్చి వెళ్ళారని మా తమ్ముడు చెప్పాడు. మిమ్మల్ని కలవ లేక పోయి నందుకు చాలా విచార పడ్డాను.


నన్ను జూన్ పదిహేనవ తేదిన అరెస్ట్ చేసి పద్దెనిమిది న రిమాండు కు పంపారు. మూడు నెలలు వాయిల్పాడు సబ్ జైలు లోను ,రెండు నెలలు చిత్తూరు గ్రేడ్ -రెండు జైలు లోను వున్నాను .పూర్తిగా ఐదు నెలలు వున్న తర్వాత ఈ నెల పదిహేడు న రిలీజ్ అయ్యాను. కండిషనల్ బెయిల్ మీద ప్రస్తుతం రోజుకు రెండు సార్లు పోలిస్ స్టేషన్ లో సంతకం పెడుతూ తిరుపతి లోనే వున్నాను. నా మీద హత్యా,బాంబులు,కత్తులు ,తుపాకులు,కేసు పెట్టారు. ఈ జిల్లా లో కలికిరి సమితి ప్రసిడెంట్ మల్రెడ్డి అనే భూస్వామి ని ,నేను మరో పడి మంది కలసి హత్య చేసినట్లు కథనం. అతను పొయినా సం. ఏప్రిల్ నెలలో పీపుల్స్ వార్ పార్టి చేత హత్య చేయ బడ్డాడు .నేను పాల్గొనక పోయినా ఒక క్రూర భూస్వామి ని హత్యాచేసిన అభి యోగం నా మీద మోపి నందుకు గర్విస్తున్నాను. విప్లవం లో ఇటు వంటి నిర్భందకాండ మాములేగా.


జైల్లో నేను రాసిన ఒక కవిత ను జనప్రభ లో ప్రచురణకు పంపుతున్నాను . ప్రచురించ గలరని ఆశిస్తూ న్నను. పత్రికలూ పంపుతూ వుండండి. త్వరలో చందా పంపిస్తాను.


ప్రస్తుతం రాష్ట్రం లో విప్ల వోద్యమం మీద నిర్భంద కాండ చాలా ఎక్కువ గానే వుంది.ఇలాంటి సమయాల లోనే రచయితల బాధ్యతా ఎక్కువగా వుంటుంది. ఆ భాద్యత ను ,మీ వంతు కర్తవ్యంగా మీరు జనప్రభ ద్వారా నేర వేర్చ గలరని ఆశిస్తూ సెలవు తీసుకుంటాను. వెంటనే వుత్తరం వ్రాయండి.


మీ


త్రిపురనేని శ్రీనివాస్



పై ఉత్తరానికి సమాధానం గా , "మనుషుల మనసులను మంచి మార్పు కోరే చైతన్యదీప్తులు గా వెలిగించతమే నా లక్ష్యం "అని రాసాను.


తరవాత వేగుల ద్వారా శ్రీనివాస్ చేస్తున్న రక రకాల ప్రయాణాల గురించి తెలుసుకుంటుననపుడు ఏడుగు తున్నాడో ,దిగ జారుతున్నాడో అర్థమయ్యేది కాదు.


"ఆంద్ర జ్యోతి " వార పత్రిక సంపాదకుడు గా వెనుక బడిన వాడ ,దళితవాడ ,స్త్రీ వాడ లను ,పత్రిక లో ప్రముఖం గా చర్చ కు పెట్టాడు. కాగా ఆయా చర్చల వల్ల ఈ వాదాలు జనాలను కలిపాయో ,చీల్చతానికి పనికి వచ్చాయో తెలియదు కాని,అందరు హాయిగా మాట్లాడుకునే పరిస్థితి పోయింది . తెలంగాణావాదం లాంటివి మొదలు అవుతున్న దశలో athanu మరణించాడు. ఆ తరువాతి కాలంలో నన్ను చూసినా ,నేను పలకరించే ప్రయత్నం చేసినా ,తన స్థాయి చాలా గొప్పదన్నట్లు ప్రవర్తిం చేవాడు. రాస్తున్న కవిత్వానికి ,ఆచరణకి అబెధం చూపాలని ప్రయత్ని స్తున్నపుడు ,- నీచ ,స్వార్థ,సంకుచిత,ప్రయోజనాలు కలిగిన ,అన్ని రకాల ప్రజాపార్టీ లా పేరుతొ వున్న, వాటి అనుభంద సంస్థలలో వున్న వ్యక్తులు నన్ను అనేక ఇబ్బందులు గురిచేసి నప్పుడు ,మొక్కవోని ఆత్మ విశ్వాసం తో నిలబదినపుడు, జి.శ్రీరామా మూర్తి గా బ్రతుకుతూ,కవిగా చచ్చి పొయినా 'నిజం' ,' ఎన్ని దుష్ట శక్తులు,మరిన్ని ప్రజా వ్యతిరేక శక్తులు ,ఎన్నెన్ని పన్నాగాలతో ,ప్రలోభాలతో ,ప్రజభ్య్దయ ప్రభాకరులను హరించి వేసినా, నీ వంటి ఉదయారుణ కిరణాలను మాత్రం నిశ్శేషం చేయజాలవు. నిజాయితీ,ప్రజా నిబద్ధత ,నీలో చావా నంత కాలం నీ అక్షరాలూ నిప్పురవ్వలు .రివిజినిజం,రాజీతనపు చెదలు వాటి దరిచేరవు " అని' పెన్ను' చరిచి దన్ను గా నిలిపాడు.


ఆ తరవాత త్రిపురనేని శ్రీనివాస్ ప్రముఖ వెండి తేరా దర్శకుడు రాంగోపాల్ వర్మ తో కలసి సినిమా కుడా తీస్తున్నాడని ,వింటున్న దశలోనే ,aa charchala'మత్తుగా " దుర్మరణం చెందాడని విన్నాను.

Saturday, August 14, 2010

రాంబాబు కాపరం

నమస్కారం .నేను రాంబాబు గా నటించిన హాస్య నాటిక , 'రాంబాబు కాపరం" అనే రేడియో నాటిక లింకు పంపుతున్నాను. రచన : అద్దేపల్లి భరత్ కుమార్ , నిర్వహణ : ఎలిసెల నాగేశ్వర రావు , పాత్రలు :రాంబాబు : తాతా రమేశ్ బాబు ,సీత : వి.ఎస్.,రత్నమాల ,వానర మూర్తి : డి. నాగేశ్వర రావు, సింగినాథం ; పఠాన్ చందు ఖాన్ .ఈ నాటిక ఫిబ్రవరి 2 ,2008 రాత్రి 9 .30 నుండి 10 వరకు -ఆకాశవాణి విజయవాడ కేంద్రం నిర్మించి ప్రసారం చేసింది.
లింకు : http://www.mediafire.com/?f9xcq56wta162tu
విని మీ అభిప్రాయాన్ని తెలుపు తారని ఆశిస్తూ ........